Student jac attacks on d purandeswari

Student JAC Attacks on D Purandeswari, Student JAC Attacks on Minister Purandeswari, Seemandhra Protesters Attacks, Visakha Airport, Protesters Attack Purandeswari House

Student JAC Attacks on D Purandeswari, Student JAC Attacks on Minister Purandeswari ,

చిన్నమ్మకు సమైక్య సెగ.. వైద్యం బంద్

Posted: 10/18/2013 04:11 PM IST
Student jac attacks on d purandeswari

కేంద్రమంత్రి పురందేశ్వరికి సమైక్య సెగ తగిలింది.ఈరోజు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో పురందేశ్వరిని విద్యార్థులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్ర విభజన ఆగే పరిస్థితి లేనందున జీవోఎంకు రూట్‌మ్యాప్ ఇద్దామంటూ కేంద్ర మంత్రి పురందేశ్వరి ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమైంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు నగరంలోని కొందరు పారిశ్రామికవేత్తలతో సమావేశమై సమైక్య ఉద్యమంపై చర్చించినట్లు తెలిసింది.

 

సీమాంధ్ర ప్రాంతం చాలా నష్టపోయిందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏం కావాలనే విషయాన్ని విభజనపై నియమించిన కేంద్రమంత్రుల బృందానికి వివరిద్దామని సమావేశంలో పురందేశ్వరి ప్రస్తావించగా, అందుకు పారిశ్రామికవే త్తలు అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. తామంతా సమైక్యవాదానికి కట్టుబడి ఉద్యమం చేస్తుంటే విభజనను అంగీకరిస్తూ రూట్‌మ్యాప్ ఎలా ఇస్తామని పారిశ్రామికవేత్తలు నిలదీసినట్లు తెలిసింది.

 

వైద్యం బంద్

సమైక్యాంద్ర ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వ వైద్యుల సంఘం పిలుపు మేరకు ఓపీ విభాగాలు మూతపడ్డాయి. ఉత్తరాంద్ర జిల్లా ఆరోగ్య ప్రధాయినిగా గుర్తింపు పొందిన కేజీహెచ్ తో సహా నగరంలో ఉన్న ఆర్.. హెచ్, టి.బి, .డి.హెచ్ , మెంటల్ కేర్ , వీజీహెచ్, ఈఎన్జీ ఆసుపత్రుల్లో ఓపీ విభాగాలు పని చేయలేదు. ప్రభుత్వ వైద్యుల సంఘం కేంద్ర కమిటి నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. ఈనెల 26 వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. దసరా పండగ నేపధ్యంలో నాలుగు రోజుల పాటు ఓపీలను తెరిచిన వైద్యులు మళ్లీ నిలిపివేయడంతో రోగుల అవస్థలు మొదలయ్యాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more