Ap to soon submit vizag tirupati itir reports to centre

AP to soon submit Vizag-Tirupati ITIR reports to Centre, Visakhapatnam, Information Technology Investment Region ITIR, Visakhapatnam to get ITIR, ITIR in Visakhapatnam

AP to soon submit Vizag-Tirupati ITIR reports to Centre

విశాఖలో ఐటీఐఆర్- దొరికిన హైటెక్ వ్యభిచార ముఠా

Posted: 10/22/2013 06:08 PM IST
Ap to soon submit vizag tirupati itir reports to centre

విశాఖలో హైటెక్‌ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. బీచ్‌ రోడ్డు అఫిషియల్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో వన్ టౌన్ పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు. భార్యాభర్తల సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుపతికి చెందిన ఇద్దరు బాలికలను రక్షించి.. చైల్డ్‌ హోమ్‌కు తరలించారు. ఇక నిర్వాహకుడు వీకె రెడ్డి, బ్రోకర్ జిలానీలు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారైనవారి కోసం గాలిస్తున్నారు.

 

ఐటీఐఆర్

 

రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాల్లో ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్)లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ తరహాలోనే విశాఖపట్నంలో ఒకటి.. తిరుపతి, అనంతపురం, నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ ‘తిరుపతి ఐటీఐఆర్’ ప్రాజెక్టులను ప్రభుత్వం నెలకొల్పనుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిర్దిష్ట క్లస్టర్లను గుర్తించి తిరుపతి ఐటీఐఆర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

 

ఒక్కొక్క ప్రాంతంలో 4 వేల ఎకరాల చొప్పున మూడు ప్రాంతాల్లోనూ కలిపి మొత్తం 12 వేల ఎకరాల పరిధిలో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సచివాలయంలో మంత్రి పొన్నాల మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయం, బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్న అనంతపురం జిల్లాలోని ప్రాంతాల్లో ఐటీ, అనుబంధ సంస్థల స్థాపనకు వసతుల కల్పన, అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ఈ ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై సర్వే నిర్వహించే బాధ్యతను ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించామని, ఈనెల 24, 25 తేదీల్లో సదరు సంస్థ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తుందని చెప్పారు. 26వ తేదీన సంబంధిత జిల్లా అధికారులతో చర్చిస్తుందన్నారు. అనంతరం సమగ్ర పథక నివేదిక(డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నట్టు వివరించారు.

 

పెద్ద ఎత్తున ఉద్యోగాలు..

పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలకు వీలు కల్పించే ఐటీఐఆర్‌లో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల సంస్థలు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మాన్యు ఫాక్చరింగ్ సంస్థలు ఏర్పాటవుతాయి. తొలి ఐదేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. రెండో విడతలో 15 నుంచి 20 ఏళ్ల కాలంలో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. ఉత్పత్తి యూనిట్లు, ప్రజావసరాలు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన యంత్రాంగం, నివాస ప్రాంతం, పరిపాలన సేవలు భాగంగా ఉంటాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్(ఎస్‌ఈజడ్)లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, వేర్‌హౌసింగ్ జోన్లు, ఎగుమతులకు సంబంధించిన యూనిట్లు, అభివృద్ధి కేంద్రాలు కూడా ఉంటాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more