Ghmc land

ghmc land.png

Posted: 02/27/2013 07:59 PM IST
Ghmc land

నగరం నడిబొడ్డులో రూ.25 కోట్లు విలువచేసే దాదాపు మూడెకరాల జీవీఎంసీ స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నేతల అండతో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని నిర్మాణాలు ఇప్పటికే అమ్మేశారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. పైగా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం ఉందంటూ తప్పించుకుంటున్నారు. కౌన్సిల్ తీర్మానం మేరకు తాత్కాలిక వసతి షెడ్లు నిర్మించాల్సిన అధికారులు నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అన్యాక్రాంతం చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. పూర్ణామార్కెట్ ఆధునీకరణ ప్రతిపాదనలతో దాన్ని అనుకుని దుర్గాలమ్మగుడి రోడ్డులో ఉన్న పండ్ల దుకాణాలను తొలగించాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయంగా పాతబస్టాండ్ స్థలంలో తాత్కాలిక షెడ్లు నిర్మించాలని రెండేళ్ల క్రితం కౌన్సిల్ తీర్మానించింది. పండ్ల వర్తక సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరించగా 33 మంది ఆసక్తి చూపారు. పూర్ణామార్కెట్ ఆధునీకరణ పేరుతో తమను పై అంతస్తులకు పంపి గ్రౌండ్‌ఫ్లోర్‌లోని షాపుల్ని స్థానిక నేతలు దక్కించుకునే యోచనలో ఉన్నారన్న సమాచారంతో అనంతరం వీరు వెనుకంజవేశారు. వీరి సమ్మతితో సంబంధం లేకుండా అప్పటి పాలక మండలి పాతబస్టాండ్ స్థలాన్ని రూ.లక్షలు వెచ్చించి చదునుచేసింది. ఈ స్థలంలో ఒక్కో షెడ్డుకు రూ.లక్ష ఖర్చుచేసి 50 షెడ్లను నిర్మించారు. ఏడాదిన్నరగా ఇవి ఖాళీగానే ఉన్నాయి. కొందరు వీటిని అమ్ముకున్నారు. తాజాగా ఈ షెడ్లను కూల్చేసి జీవీఎంసీతో సంబంధం లేకుండా కొందరు శాశ్వత నిర్మాణాలు చేపడుతుండడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sims projects director arrested
Visakhapatnam gets 4 new trains  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more