రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలోని స్వరజ్ మైదానంలో మహిళా గర్జన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యవాణి మాట్లాడుతూ.. కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ ఆమె ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టడాన్ని రాష్ట్ర ప్రజలంతా ఎంతో గర్వంగా చెప్పుకుంటారని తెలిపారు. తెలుగు ప్రజల్లో ఎంతో ఉత్తేజం, చైతన్యం ఉంటుందన్నారు. విభజన తెగులును తెలుగువారే అంతమొందించగలరని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ను దోచుకోవడానికే నేతలు పరిపాలన కొనసాగిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య
జిల్లాలోని విజయవాడలోని గొల్లపూడి శ్రీచైతన్య కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య నగరంలో కలకలం రేపింది. తెనాలిలోని సంజీవ్నగర్కు చెందిన ఈశ్వర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోని బాత్రూంలో టవల్తో ఉరేసుకుని మృతిచెందాడు. అనారోగ్య సమస్యల వల్లే ఈశ్వర్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలస్తోంది. విజయవాడ గొల్లపూడి శ్రీచైతన్య కాలేజీలో ఈశ్వర్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆరోగ్యం బాగాలేదని ఉదయం కళాశాల ఇన్ ఛార్జీకి ఫిర్యాదు చేశాడు. అదే రోజు సాయంత్రం హాస్టల్ గదిలో ఉన్న బాత్రూంలోని పైపుకు టవల్తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరునాడు హస్టల్లోని బాత్రూంల్లో నీళ్లు రాకపోవడంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్కు తెలిపారు. అందరూ కలిసి నీళ్ల పైపులను పరిశీలించారు. అదే సమయంలో అక్కడ ఈశ్వర్ మృతదేహాన్ని చూశారు. విషయం తెలసుకున్న కళాశాల యజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more