Seemandhra people calls for bandh

Seemandhra people calls for bandh, 72 hours seemandhra bandh, Seemandhra JAC calls for bandh, seemandhra calls for 72 hours bandh, 72 hours seemandhra bandh, seemandhra jac calls for bandh, seemandhra calls for bandh, tension in coastal andhra, rayalaseema, seemandhra students call for bandh in vijayawada, breaking news, ap politics, political news, andhra news,

Seemandhra people calls for bandh, 72 hours seemandhra bandh, Seemandhra JAC calls for bandh

కొనసాగుతున్న బంద్

Posted: 07/31/2013 11:52 AM IST
Seemandhra people calls for bandh

సిడబ్ల్యూసి నిర్ణయంపై తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా... సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెసు పార్టీ ప్రకటనతో సీమాంధ్ర రగులుతోంది. విశాఖ, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి రాస్తారోకోలో నిర్వహిస్తోంది. వ్యాపారస్తులు స్వచ్చంధంగా దుకాణాలు బంద్ చేశారు. విద్యాసంస్థలు బంద్ పెట్టారు. విద్యార్థులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు.

Seemandhra people calls for bandh

 

కాంగ్రెసు పార్టీ ప్రకటన రాగానే సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిశాయి. విభజనను అడ్డుకోలేని నేతలను చేతకాని వారిగా పరిగణించి 18 ఏళ్లు వెలివేస్తున్నట్లు ప్రకటించారు. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యూపిఏ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తూ ఐకాస నేతలు తమ నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి సీమాంధ్ర బంద్‌కు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పలువురిని ముందస్తుగా అరెస్టు చేశారు. కాగా బంద్ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

72 hours seemandhra bandh

విశాఖపట్నం : కంచరపాలెం దగ్గర జాతీయరహదారిపై సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆందోళనకు దిగింది. దీంతో అక్కడ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏయూ విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. వీరికి వీసీ సంఘీభావం తెలిపారు.

జగదాంబ సెంటర్ వద కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు షాపులను మూసివేయిస్తున్నారు. అక్కడ నిర్వహించిన మానవహారంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎన్టీపీఎస్‌లో ఉద్యోగులు విధులు బహిష్కరించారు.

జిల్లాలో పలు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించారు.

Seemandhra JAC calls for bandh

కర్నూలు : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పలు పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నగరంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

కృష్ణా : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బస్టాండ్ వద్ద విద్యార్థి జేఏసీ ధర్నా నిర్వహించడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

బెంజి సర్కిల్ వద్ద దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

మూడు రోజుల పాటు విధులు బహిష్కరించాలని బెజవాడ బార్ అసోసియేషన్ నిర్ణయించింది.

అనంతపురం : ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ బస్సులు, ఆటోలపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా భారీగా పోలీసు బలగాల మోహరించారు.

  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more