వీకెండ్స్లో నాన్ వెజ్ లాగించేద్దామనుకునే భోజన ప్రియులూ జాగ్రత్తగా ఉండండి. మీరు కొనుగోలు చేసే చికెన్ తాజాది అవునో కాదో చూసి మరీ కొనుగోలు చేయండి. ఎందుకంటే జబ్బు పడి మృత్యువాత పడిన కోళ్ళ మాంసం కూడా చాటు మాటున మార్కెట్లోకి వస్తోంది. ప్రజారోగ్యశాఖ తమనేమీ చేయలేదన్న ధైర్యమో ఏమో చచ్చిన కోళ్ళను కూడా డ్రెసింగ్ చేయించి మాంసం విక్రయించటానికి సిద్ధపడుతున్నారు కొంతమంది ఘనులు. నగరంలో జబ్బు పడి చనిపోయిన కోళ్ళ మాంసాన్ని విక్రయించే ముఠా తయారైంది. అక్రమార్జన పరులు కొందరు పౌల్ట్రీ ఫారాలలో జబ్బుల బారిన పడి చనిపోయిన కోళ్ళను నగరానికి తీసుకు వచ్చి డ్రెస్సింగ్ చేయించి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలాంటి ముఠాలకు నగరంలోని పలు మాంసం విక్రయ కేంద్రాలు వేదికలుగా మారాయి. భారీ ఎత్తున కోళ్ళను డ్రెస్సింగ్ చేయాలంటే చిన్నపాటి దుకాణాలు పనికిరావు. అందుకే కార్పొరేషన్కు సంబంధించిన మాంసం, చేపల మార్కెట్లను ఈ ముఠా ఎంచుకుంటోంది.
అలాంటి వాటిలో చిట్టినగర్ గుజ్జారి ఎల్లారావు (వీరాంజనేయ) నగరపాలక సంస్థ మార్కెట్ కూడా ఒకటి. ఈ మార్కెట్లో అన్ని రకాల మాంసం, సముద్ర జంతువుల మాంసాలు విక్రయిస్తారు. మాంసం దుకాణాల తనిఖీల పర్యవేక్షణ అధికారాలన్నీ కార్పొరేషన్ చేతుల్లో నుంచి జిల్లా ఫుడ్ తనిఖీ అధికారుల చేతుల్లోకి వెళ్లిన నాటి నుంచి ఈ మార్కెట్లో జబ్బుల బారిన పడి చనిపోయిన కోళ్ళు, జంతువుల మాంసాన్ని డ్రెస్సింగ్ చేస్తున్నారని, వాటినే విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ, జబ్బు పడి చనిపోయిన కోళ్ళను డ్రెస్సింగ్ చేయించటానికి వచ్చిన ముఠా ఒకటి స్థానికులకు పట్టుబడింది. ట్రక్కు ఆటోలో వందలాది కోళ్ళను మార్కెట్ తీసుకు వస్తుండగా స్థానికులు గమనించారు. అప్పటికే కోళ్ళు చనిపోయి ఉండటంతో అనుమానం వచ్చి మీడియా దృష్టికి తీసుకు వచ్చారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more