దేశం మొత్తం మీద వినోదం కోసం ఎక్కువగా ఖర్చుపెట్టేది ముంబై, ఢిల్లీ, చెన్నై కాదు! అది... మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. సమాచార వినిమయం (కమ్యూనికేషన్స్)లో హైదరాబాద్ ఐదో స్థానం దక్కించుకుంది. ఆనందమయమైన టాప్-20 జిల్లాల్లో హైదరాబాద్కు కూడా చోటు దక్కింది. ఇది... 11వ స్థానంలో నిలిచింది. 'ఆనందంగా ఉండటమంటే డబ్బులు సంపాదించడం మాత్రమే కాదని మా అధ్యయనం స్పష్టం చేసింది' ఈ సర్వేలో కీలక పాత్ర పోషించిన కె. రామన్ తో అన్నారు.
ఈశాన్యంలో మహిళలకు మేలు
మహిళల భద్రతకు, వారికి అందే సౌకర్యాలకు మధ్య సంబంధం లేదని ఈ అధ్యయనంలో స్పష్టమైంది. అనేక వసతులు, సౌకర్యాలున్న ఇతరత్రా ప్రాంతాలకంటే... ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలకు భద్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దక్షిణాది రాష్ట్రాలు మాత్రం మహిళల భద్రత విషయంలో మెరుగ్గా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం భద్రత లేదని తేలిందని రామన్ చెప్పారు. భద్రతా సూచీని స్త్రీ, పురుషుల నిష్పత్తి, అత్యాచారాలు, వరకట్న మృతుల సంఖ్య ఆధారంగా రూపొందించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 11వ స్థానం దక్కింది.
ఇక జిల్లాల విషయంలో భద్రతా సమస్యలు ఎక్కువగా ఉన్న నగరాలలో హైదరాబాద్, ఢిల్లీ అగ్రస్థానంలో (ఇండెక్స్లో చివరి స్థానం) ఉన్నాయి. మహిళలపై ఎక్కువ అత్యాచారాలు జరిగే మొదటి ఐదు జిల్లాలు తమిళనాడు, పాండిచ్చేరిలలోనే ఉండటం గమనార్హం. ఆర్థికంగా అభివృద్ధి సాధించిన ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు కూడా మహిళా భద్రత విషయంలో వెనకబడి ఉన్నాయి. మొత్తంగా చూస్తే... అటు ఆనందమయ జీవితంలోనూ, ఇటు మహిళల భద్రత విషయంలోనూ దక్షిణాది రాష్ట్రాలే మెరుగ్గా ఉన్నాయి.
ఇదీ సూచీ
ఇల్లు, ఇంటి అలంకరణ, వంటింటి సౌకర్యాలు, శుభ్రత, వినోదం, ఆరోగ్యం, కమ్యూనికేషన్స్, రవాణా, విద్య - ఇలా ఎనిమిది అంశాలపై జాతీయ స్థాయిలో సమాచారం సేకరించారు. 'వెల్ బీయింగ్ ఇండెక్స్'ను రాష్ట్రాలు, జిల్లాల వారీగా రూపొందించారు. ఈ సూచీలో గోవా మొదటి స్థానంలో నిలవగా... ఢిల్లీ రెండో స్థానం ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్కు 8వ స్థానం దక్కింది. డీవీడీలు, సినిమాలపై పెట్టే ఖర్చు మొదలైన అంశాల ఆధారంగా 'వినోదాన్ని' కొలిచి... అందులో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉన్నట్లు తేల్చారు.
మహిళాలోకం
* మహిళా భద్రతవిషయంలో దక్షిణాది రాష్ట్రాలు, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు ముందున్నాయి.
* మహిళలకు పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలు 'డేంజర్'.
* మహిళలకు భద్రమైన నగరాల్లో చెన్నై, బెంగళూరు ముందున్నాయి.
* వరకట్న మరణాలు, అత్యాచారాల్లో దేశ రాజధాని ఢిల్లీదే తొలిస్థానం.
ఎందులో ఎవరు ఫస్ట్?
ఇల్లు, ఇంటి అలంకరణ: గోవా
వంటింటి సౌకర్యాలు: యానాం
పరిశుభ్రత: పాండిచ్చేరి
ఎంటర్టైన్మెంట్: కృష్ణా
ఆరోగ్య సదుపాయాలు: ఉత్తర పరగణాలు
కమ్యూనికేషన్స్: హైదరాబాద్
రవాణా: లాహుల్, తప్తి (హిమాచల్ప్రదేశ్)
విద్యపై ఖర్చు: హరిద్వార్
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more