కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను నిట్ట నిలువునా దోచుకుంటున్నారు. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలపై డబ్బు వసూలుకు అలిపిరి వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేసింది టీటీడీ. అలిపిరి నుంచి కొండపైకి 22 కిలోమీటర్లు దూరానికి వాహనాన్ని బట్టి కనిష్టంగా 2 రూపాయల నుంచి 50 దాకా వసూలు చేస్తున్నారు. అలా వసూలు చేసిన డబ్బంతా టీటీడీ ఖాతాలోకి వెళ్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే భక్తులు పాప ప్రక్షాళన కోసం కొండపైనున్న పాపవినాశనానికి వెళ్తారు. రిజర్వు ఫారెస్ట్ లో వెళ్లాల్సిన సూమారు రెండు కిలో మీటర్ల దూరానికి 5 నుంచి 30 రూపాయల దాకా భక్తులనుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అటవీ శాఖాధికారులు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రభుత్వం నుంచి ఈ టోల్గేట్ కు ఎలాంటి పర్మిషన్ లేదు. అయితే ఈ బాగోతం 2009 నుంచి యదేఛ్చగా సాగుతోంది. ఈ టోల్గేట్ ద్వారా నెలకు దాదాపు కోట్ల రూపాయలు భక్తుల నుంచి కొల్లగొడుతున్నారు. టోల్ ఫలితంగా ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాన్ని సాకుగా చూపుతూ భక్తులనుంచి అదనంగా వసూలు చేస్తున్నారు.అటవీ శాఖ అనధికారంగా టోల్ ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ,ప్రభుత్వం దృష్టి సారించి అక్రమ టోల్ను అరికట్టాలని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more