ప్రస్తుతకాలంలో కంప్యూటర్ వాడకం చాలా సహజమయిపోయింది. పిల్లలనుంచి ఆఫీసులలో పనిచేసే పెద్దలవరకు ప్రతిఒక్కరు ఈ కంప్యూటర్ ను నిత్యం ఉపయోగిస్తుంటారు.
పిల్లలు ఆటలు ఆడుకోవడానికి, ఇంటర్నెట్ ను ఆస్వాదించడానికి కంప్యూటర్ ను ఉపయోగిస్తే.. పెద్దలు ఆఫీసు కార్యకలాపాలలోనూ, సోషల్ నెటవర్కింగ్ సైట్లలో చాటింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. నేటి సమాజంలో యువతీయువకులు దీనిని విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు.
కంప్యూటర్ వల్ల చాలావరకు ఉపయోగాలు వున్నాయి. మనకు తెలియని కొత్త విషయాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలకు గేమ్స్ సహకారంతో మంచి విజ్ఞానాన్ని, చదువును ప్రసాదించవ్చు. సమాచారాన్ని ఒకచోటు నుంచి మరో చోటుకు క్షణాల్లోనే పంపించవచ్చు. కొత్త పరిచయాలు చేసుకోవచ్చు.
అయితే కంప్యూటర్ నిత్యం వాడుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. అందులో ముఖ్యమైన సమస్య కళ్లు దెబ్బతినడం. క్రమంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
కళ్లు అనేవి మానవ శరీరంలో అత్యంత ప్రముఖపాత్రను వహిస్తాయి. ఇవి మనకు బయటప్రపంచాన్ని చూపించడానికి, అందాలను ఆస్వాదించుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు.. ఇవి మన శరీర ఆరోగ్యాన్ని కూడా తెలుపుతాయి. అయితే ఇవే కళ్లు నిత్యం కంప్యూటర్ వాడుకోవడం ద్వారా చాలా దెబ్బతింటున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారు కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. కంప్యూటర్ కాంతి నేరుగా కళ్లమీద పడటం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ కు గురవుతున్నారు. చాలా దగ్గరగా కూర్చుని పనిచేస్తారు కాబట్టి... అక్షరాలు రానురాను అస్పష్టతగా కనిపించడం మొదలవుతాయి. ప్రస్తుతం ప్రతిఒక్కరికి ఇదే సమస్య.
కాబట్టి కంప్యూటర్ ముందు ఎక్కువసమయం కూర్చునేవారు కొన్ని చిట్కాలను పాటిస్తే.. కళ్లను రక్షించుకోవచ్చు.
1. కంప్యూటర్ ముందు నిత్యం కూర్చుని వుండటం వల్ల కంటినుంచి నీళ్లు కారడం మొదలవుతాయి. తరువాత డ్రైగా తయారవుతాయి. కాబట్టి అటువంటి సమయాల్లో ప్రతి 20 నిముషాలకొకసారి మన కళ్లకు విరామం ఇవ్వాలి. కంప్యూటర్ ముందునుంచి లేచి 2 నిముషాలవరకు దూరంగా చూడాలి. దీంతో కొంతమేరకు కళ్లు హాయిగా వుంటాయి. అలాగే కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు నిర్ణీతమైన దూరాన్ని పాటించాలి. కంప్యూటర్ కు దగ్గరగా కాకుండా.. కొంతమేరకు దూరంగా కూర్చుంటే మంచిది.
2. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు కళ్లు స్ట్రెయిన్ ను గురవడం సాధారణం. కానీ అది ఎక్కువ అయితే ఎంతో ప్రమాదకరం. అటువంటి సమయాల్లో ప్రతి రెండు నిముషాలకొకసారి కళ్లను సున్నితంగా వత్తుకోవాలి. దీనిని మనం కంటి వ్యాయామం అని కూడా భావించవచ్చు. దీంతో అలసట పొందిన కళ్లు కాస్త విశ్రాంతి తీసుకుంటాయి.
3. కంప్యూటర్ బ్రైట్ నెస్ ను ఎంతవరకు తగ్గించుకుంటే అంత మేలు. మనకు సౌకర్యవంతంగా వుండేవిధంగా కంప్యూటర్ బ్రైట్ నెస్ ను తగ్గించుకుని, కాంట్రాస్ట్ లెవెల్ ను కొద్దివరకు పెంచుకుంటే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు కొంతదూరం వరకు చూసినా.. కళ్లు స్పష్టంగానే వుంటాయి. ఇలా బ్రైట్ నెస్ తగ్గించుకోవడంతో కళ్లు స్ట్రెయిన్ కు గురికావు.
4. కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కేటాయించేవారు.. పరికరం కిటికీ వైపు వుండే విధంగా చూసుకోవాలి. మన చుట్టూ వుండే వాతావరణం కూడా కళ్లను ప్రభావితం చేస్తాయి కాబట్టి.. విండో సైట్ కూర్చోవడంతో... కంప్యూటర్ బ్రైట్ నెస్, విండో దగ్గరున్న వెలుతురు సమానంగా వుంటాయి. అప్పుడు మన కళ్లు స్ట్రెయిన్ కు గురికావు. పైగా అక్షరాలు స్పష్టతగా కనిపిస్తాయి. అదేవిధంగా గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ వుండేలా చూసుకుంటే చాలా మంచిది. కళ్లను ఎక్కువసేపు తెరిచి వుండకుండా.. ప్రతీసారి బ్లింక్ చేస్తూ వుండాలి.
ఈ విధంగా కంప్యూటర్ ను ఎక్కువసేపు ఉపయోగించేవారు తగిన చిట్కాలను పాటిస్తే.. వాళ్ల కళ్లు స్ట్రెయిన్, డ్రైనెస్ కు గురికాకుండా, స్పష్టంగా వుంచుతాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more