మనం ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే మొహం కడుక్కుని, తలస్నానాలు చేసి, తొందర తొందరగా ఆఫీసులకు వెళ్లిపోతాం. ఒకసారి అయితే ఇవేమీ పట్టించుకోకుండా గాబరాగాబరాగా పనులు వెళ్లిపోతాం. దీనివల్ల మన ఆరోగ్యానికి ప్రమాదమే కాకుండా, మనం చేస్తున్న పనులలో సామర్థ్యాన్ని కూడా కోల్పోతున్నాం. కాబట్టి మన ఆలోచనలను, పనిచేసే విధినిర్వహణలలో అప్పుడప్పుడూ కొన్ని మార్పులు చేసుకుంటే చాలా మంచిదని అంటున్నారు. దీంతో మన సామాజిక దృక్పథం పెరగడమే గాక, ప్రతి ఒక్క విషయంలో చురుకుగా పాల్గొంటామని సూచిస్తున్నారు నిపుణులు. దీనికితోడు మనం పనిచేసే వాతావరణ పరసరాలను బట్టి మనం చేసే పనులలో కూడా మార్పు వుంటుందని నిపుణులు చెబుతున్నారు. మనం పని చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే.. మన సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అవేవో ఒకసారి చూద్దాం....
కొంతమంది ఉద్యోగస్తులు వారు పనిచేస్తున్న చోట నిశ్శబ్దంగా వుంటే అనుకున్న సమయంలో పని అయిపోదుందంటుంటారు. కానీ ఇలా శబ్దం లేకుండా పనిచేస్తే మన మెదడుకు చురుకుగా వుండక.. మనం చేస్తున్న పనికి ఏదో ఒక చెడు జరుగుతుందని చెబుతున్నారు అమెరికాలోని జర్నల్ ఆఫ్ కన్స్యూమర్ రీసెర్చెర్లు. మనం సమర్థవంతంగా పనిచేయాలంటే ఏదో ఒక చప్పుడు వుండడం తప్పనిసరి అంటున్నారు. అంటే.. తక్కువ శబ్దంతో వినిపించేలా పాటలను వినాలని, లేదా మన ఆఫీస్ కు కొంచె దూరంలో వుండే రోడ్డు బయట వాహనాల సందడి గానీ మన చెవినపడేలా చూసుకుంటే చాలా మంచిదంటున్నారు. దీంతో మెదడు చురుకుగా వ్యవహరిస్తుందని వారు పేర్కొంటున్నారు.
మనం ఆఫీసులలో చాలావరకు 8 నుండి 10 గంటలవరకు సమయాన్ని కేటాయిస్తుంటాం. ఆ సమయాలలో మనం చేసే పనిని ఇంకా తక్కువ సమయంలో పూర్తి చేసుకోవాలని మనం నిబంధన పెట్టుకుంటే... అప్పుడు మనలో వున్న సామర్థ్యం మరింతగా పెరుగుతుందంటున్నారు. ఇలా చేయడం ద్వారా మనం మన పనిగంటల్ని ఇంకా తక్కువ చేసుకోవచ్చు. మనకు అప్పగించిన పనిని తక్కువ సమయంలో పూర్తి చేసుకోవడం ద్వారా మనకు మిగిలిన సమయం ఆదా అవుతుంది. దాంతో కొంచెం విశ్రాంతి కూడా లభిస్తుంది. దీనివల్ల మెదడు కొంచెం రిలీఫ్ అయి, మనలో వున్న సామర్థ్యాన్ని పెంపొదిస్తుంది.
ఉదయాన్నే లేవగానే అరగంటసేపు వ్యాయామం చేసుకుంటే మెదడు చురుకుదనం పెరుగుతుందని సలహా ఇస్తున్నారు నిపుణులు. దీంతో మనం కూడా మనం చేసే కార్యాకాలపాలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా ఏకాగ్రతగా నిర్వహించుకోవచ్చు. ఉదయాన్నే లేచి మనం ఇష్టారాజ్యంగా వార్తలు చదవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెదడు కూడా మన శరీరంలో ఒక భాగమే. అది కూడా నిరంతరం పనిచేస్తూ వుంటుంది. దానికంటూ విశ్రాంతి కావాలి. ఉదయాన్నే లేవగానే న్యూస్ చదవడం వల్ల మనం మానసిక స్థితికి గురికావొచ్చంటున్నారు. మెదడుకు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా రిలీఫ్ కోసం కాస్త వ్యాయామం చేసుకోవాలని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ టీనేజ్. ఈ యుక్తవయస్సులో భవిష్యత్తు కార్యాచరణకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించుకోవచ్చు. విందు - వినోదాలతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా వుండే ఈ వయస్సు... ప్రతి... Read more
May 06 | ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను... Read more
Apr 24 | ప్రస్తుతకాలంలో కార్పొరేట్ సంస్థల హవా చాలా జోరుగా సాగుతోంది. ప్రతిఒక్కరు ఇటువంటి పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ముందుగా మహిళలు ఇటువంటి వ్యవహారాలలో చాలా ముందున్నారు. మగవారికి ధీటుగా ఆడవాళ్లు... Read more
Apr 22 | కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలనే నెపంతో ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు విభిన్నంగా చేస్తున్న పనిలోను, ఉద్యోగంలోను ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందాలని... Read more
Apr 10 | ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారికి సమానంగానే గట్టిపోటీని ఇస్తున్నారు. వారు కూడా మగవారిలాగా ఆఫీసు పనులలో నిమగ్నమై విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆఫీసు పని ఎక్కువగా వుండటం వల్ల తమ వ్యక్తిగత... Read more