శ్రీముఖ లింగం ఆలయం శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరప్రాంతంలో వుంది. ఈ ఆలయం ఎంతో పురాతనమైంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రదేశాలలో చరిత్రలోనే ప్రసిద్ధిచెందిన సోమేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి ఆలయాలు కూడా వున్నాయి. ఈ గ్రామంలో లభించిన ఆధారాలప్రకారం... రాజధానికి వుండాల్సని దశలన్నింటిని అనుభవించిందని తెలుస్తోంది.
పూర్వం నుండి ఇఫ్పటివరకు మారుతున్న కాలాలమధ్య ఈ ప్రదేశంలో బైద్ధ, జైన, హిందూమతాలు ఈ ప్రాంతంలో వర్ధిల్లాయని సమాచారం. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రదేశ ఆవరణలో దొరికిన శాసనాలు, ఆధారాల ప్రకారం ఎక్కడా శ్రీముఖలింగం అని పేరు చెప్పబడలేదు. అంటే.. పూర్వం దీనికి కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనరగం అనేక రకరకాల పేర్లతో రాయబడివుంది.
ఆలయ వివరాలు :
సాధారణంగా ఆలయాల నిర్మాణం రాతితో నిర్మించడం జరుగుతుంది. కానీ ఈ ముఖలింగం మాత్రం రాతితో చెక్కింది కాదు. పూర్వం ఈ ప్రదేశంలో వున్న ‘ఇప్ప’ చెట్టు మొదలను నరికివేయగా.. అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందిందని అంటారు.
ఇప్ప చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుందని, ఆ మొదలే క్రమంగా రాపిడికి గురయి లింగంగా అవతారం ఎత్తిందని చెబుతుంటారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో ‘మధుకం’ అంటారు కాబట్టి.. ఈ ఆలయానికి ‘మధుకేశ్వరస్వామి ఆలయం’ అనే పేరొచ్చిందని అంటుంటారు.
ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక విషయాలు కూడా వున్నాయి. కేవలం గర్భాలయమే కాక.. ఎనిమిదివైపులా ఎనిమిది లింగాలు నిర్మించబడి వున్నాయి. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్యవిగ్రహాలు కూడా వుండటం విశేషం.
భీమేశ్వరాలయం శిథిలావస్థలో వుంది. ఇందులో కుమారస్వామి, దక్షిణామూర్తి, బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే వుంది. ఆనాటి కాలంలో పిడుగు ఒక శిఖరంపై పడటంతో అది కిందకు పడిపోయింది. ఆనాటి శిల్పకళాకారులు దానిని తిరిగి అదే కొండపై అమర్చారు.
చరిత్ర :
పూర్వం ఈ ప్రాంతంలో నిర్వహించిన తవ్వకాలలో సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహాలు లభించాయి. ఈ విగ్రహాలను బట్టి తెలిసిందేమింటే.. క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడు అనే రాజు ఈ ఆలయాన్ని కట్టించాడు. అతని కుమారుడైన అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more
Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more
Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more
Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more
Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more