వెయ్యేళ్ల క్రితం మన భారతదేశంలో అనేక రాజులు... కొందరు ప్రాంతాలవారీగా, కొందరు రాజ్యాలవారీగా మరికొందరు ఏకంగా భారతదేశాన్ని పరిపాలించినవారు వున్నారు. ఇటువంటి కథనాల గురించి మనం స్కూళ్లలోనూ పుస్తకాలలో చదువుకున్నాం. అయితే అప్పటి సామాన్య మానవుల జీవితం గురించి సంబంధించిన విశేసాలు చాలా తక్కువ.
అప్పటికాలంలో రాజులవారు భోగభాగ్యాలతో సుఖసంతోషాలతో తమ జీవితాలను గడిపేవారు. కానీ సామాన్య మానవులు నిర్వహించుకునే కార్యకలాపాలు, వారి జీవన విధానం గురించి అంత ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు.
హిందూ ధర్మాలలోని పురాణాల కథనాల ప్రకారం.. రాజులకు సంబంధించిన చరిత్రగాధలు ఎన్నో వర్ణించబడ్డాయి. ఆనాడు కవులు.. రాజులు, జమీందారుల పోషణలోనే జీవించారు గనుక వీరికి ప్రథమ స్థానం దక్కుతుంది. జానపద గేయాలు, కథలలో సామాన్య జీవనానికి సంబంధించిన కొన్ని విశేషాలు లభించాయి.
ఆరోజులలో చదువుకోవడం అనేది కేవలం కొన్ని వర్గాలకు, కులాలవారికి మాత్రమే పరిమితమైంది. రాజ్యానికి సంబంధించిన సమాచారాలు, న్యాయాలు కేవలం పై వర్గాలకు మాత్రమే సంకుచిత రీతిలో పరిమితమై వుండేవి. అంతేకాదు.. ఆ కాలంలో ప్రజలు అర్థంపర్థంలేని ఆచారాలను అమలు చేసుకుని, మూఢనమ్మకాలను ఎక్కువగా విశ్వసించేవారు.
ప్రాచీనకాలం నుంచి మన భారతదేశం ఒక వ్యవసాయక దేశమే. కాకతీయుల కాలంలో ఓరుగల్లులో జరిగిన మైలసంతలో ఇతర వస్తువులు, అపరాలతో బాటు ధాన్యం కూడా అమ్మేవారట. రెడ్డిరాజుల కాలంలోనూ, అంతకుముందు దేశంలోగల భూమి రాజుగారి సొంతమే.
రాజు భూమిని రైతులకు కౌలుగా ఇచ్చేవాడు. ఆ రోజులలో పన్ను విధానం వుండేది. పైగా ఈ పన్ను కూడా బలవంతంగా వసూలు చేసుకునేవారు. పన్నులు చెల్లించకపోతే.. రాజుభటులను ఎదురించే శక్తి ఆ ప్రజలలో వుండేది కాదు.
ఆనాడు వున్న ప్రాంతాలలో ఎక్కువగా కాలువలు వుండేవి కావు. పంటలకు వీలైన భూములున్న ప్రదేశాలలో రాజులు, మంత్రులు, శ్రీమంతులు, సేనానులు మొదలైనవారు చెరువులు, కుంటలు తవ్వించేవారు. ఆ చెరువుల నుంచి వచ్చే నీటిని పొలాలకు మోట ద్వారా పెట్టేవారు.
మన ఆంధ్రరాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పల్నాటి ప్రాంతంలోని రేగడి భూములలో జొన్నలు బాగా పండించేవారట. కృష్ణా జిల్లాలో, గోదావరి జిల్లాలొ మేలిరకం ధాన్యాలను పండించేవారు.
పన్నులు చెల్లించనివారిని నిజాం ప్రభుత్వ కాలంలో తెలంగాణా ప్రాంతంలో ప్రజలను చాలా క్రూరంగా హింసించేవారని ‘‘ఆంధ్రుల సాంఘిక గ్రంథం’’లో పేర్కొనబడింది.
ఇంకా రకరకాలుగా సామాన్య మానవులు అనేక కష్టాలను అనుభవిస్తూ.. రాజులకు సేవలు చేస్తూ తమ జీవితాన్ని గడిపేవారు.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more