గోమఠేశ్వర విగ్రహం
శ్రావణబెళగొళ గా పిలవబడే ఈ ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో ఉంది. 17.5 మీటర్ల ఎత్తుగల గోమఠేశ్వర అలియాస్ బహుబలి విగ్రహం క్రీ.శ 978 కాలంనాటికి చెందింది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏక శిలా విగ్రహాలలో ఒకటి. నిస్వార్ధానికి, త్యాగానికి ప్రతీకగా జైనులు ఈ విగ్రహాన్ని కొలుస్తారు.