సావిత్రీభాయ్ పూలే
మన భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈమె తన భర్త అయిన జ్యతిరావ్ పూలేతో కలిసి 1848లో బాలికల కోసం ప్రత్యేకంగా పుణేలో ఒక పాఠశాలను ప్రారంభించారు. ఆనాడు మహిళల మీద జరుగుతున్న అరాచకాలను, బాల్యవివాహాల వంటి దుష్ట సంప్రదాయాలను అరికట్టేందుకు ‘‘నాయీ’’ (మంగలి) అనే సమాజాన్ని సంఘటితం చేశారు.