తిరుమల వెంకటేశ్వర మందిరం
శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటయిన ఈ మందిరం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో వుంది. ఈ పట్టణానికే ఆనుకుని వున్న కొండలపై శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయం వుంది. దీనినే తిరుమల ప్రాంతంగా వ్యవహరిస్తారు. ఈ రెండింటినీ కలిపి తిరుమల తిరుపతి అని వ్యవహరిస్తారు. క్రీ.శ. 614వ సంవత్సరంలో సామవై కాలానికి చెందిన పల్లవ రాణి ఆనంద నిలయ జీర్ణోద్ధారణకు కృషి చేసింది. అలాగే సామవై పెరిందేవి అదే కాలంలో భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని బహూకరించింది. పురాణాల కథనాల ప్రకారం... పూర్వం వైఖానస అర్చకుడు శ్రీమాన్ గోపీనాథ దీక్షితులవారు శ్రీవారి మూర్తిని... స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్ల క్రింద వున్న చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రతిష్టించడం జరిగింది.