కాణిపాకం సిద్ధి వినాయక దేవాలయం
ఈ వినాయక ఆలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి కుళోత్తంగా చోళుడు కట్టించాడని ఇక్కడ లభించిన కొన్ని శాసనాల ఆధారంగా చరిత్రకారులు తెలుపుతున్నారు. ఆ తరువాత 15వ శతాబ్దంలో విజయనగర రాజులు దీనిని విస్తరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం ప్రాంతంలో వుంది. ఈ పుణ్యక్షేత్రం చిత్తూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో తిరుపతి - బెంగుళూరు జాతీయ రహదారిపై వుంది. ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభువుగా వెలిశాడు.