తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని.. కుటుంబం అనే పదాన్ని విస్తృత కోణంలో చూడాల్సిన అవసరముందని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. తమకు పిల్లలు లేని కారణంగా.. తమకు సంక్రమించిన ఆస్తిని హిందూ వైద్యవం పోందిన మహిళ తన చరమాంకంలో తన తండ్రి తరపు బంధువులకు.. లేదా అమె రక్తసంబంధికులలో ఎవరికైనా అందించవచ్చునని న్యాయస్థానం అదేశాలు జారీచేసింది.
హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలు తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను తమ ఇష్టానుసారం తమ కుటుంబ వారసులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. పిల్లలు లేని హిందూ మహిళలు.. తమ తదనంతరం తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను తమ భర్త తరపు కుటింబికులకే కాకుండా.. అమె తన తండ్రి తరపు వారసులకు కూడా అందించవచ్చునని తీర్పును వెలువరించింది. హిందూ కుటుంబం అనే పదాన్ని చిన్నగా చూడకూడదని ఈ సందర్భంగా సూచించింది.
హిందూ మహిళ తన తండ్రి తరపు వారసులను పరాయి వ్యక్తులుగా పరిగణించలేమని న్యాయస్థానం పేర్కోంది. ఈ మేరకు హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(1)(డి) ప్రకారం హిందూ మహిళకు తన భర్త తరపు వారితో పాటు తన తండ్రి తరపు వారు కూడా వారసులుగానే పరిగణించాల్సి వుంటుందని పలు కేసులను జోడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీంతో హిందూ మహిళ తన తండ్రి తరపు వారసులకు కూడా తన ఆస్తిని పంచి ఇచ్చే అధికారం వుందని స్పష్టం చేసింది.
కుటుంబం అనే పదాన్ని విసృత్త భావంతో చూడాలని.. అంతేకాని దగ్గరి బంధువులను మాత్రమే కుటుంబంగా, చట్టబద్ద వారుసులుగా భావించడం సరికాదని పేర్కోంది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకభవించిన న్యాయస్థానం.. కక్షిదారులు వేసిన పిటీషన్ ను తోసిపుచ్చింది. హిందూ మహిళకు సంబంధించిన వీలునామా లేని వారసత్వ అస్తులు సెక్షన్ 16 ప్రకారం పరిగణించబడతాయని సెక్షన్ 15 చెబుతోందని న్యాయస్థానం పేర్కోంది. దీని ప్రకారం.. మొదట, అమె కుమారులు మరియు కుమార్తెలపై (లేదా మనువలు, మనువరాళ్లు) మరియు భర్తకు.. లేదా భర్త వారసులకు, లేదా తల్లిదండ్రులకు, లేదా తల్లిదండ్రుల వారసులకు ఇక చివరగా తల్లి తరపు వారసులకు కూడా ఇచ్చే అధికారం ఉందని న్యాయస్థానం పేర్కోంది.
సంతానం లేని వితంతువు తన సోదరుల కొడుకుకు అనుకూలంగా తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని అప్పగించడాన్ని అనుమతించిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సందర్భంలో, జగ్నో అనే మహిళకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. భర్త షేర్ సింగ్ మరణానంతరం తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని తన సోదరుడి కుమారులకు పంచి ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ షేర్ షింగ్ కుమారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం వారి పిటీషన్ ను తోసిపుచ్చింది. ఆస్తిపై జగ్నోకు పూర్తి హక్కులు వున్నాయని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more
Jun 24 | భర్త నుంచి విడాకులు పోందకుండా సెపరేట్ గా వుండటం సాధ్యమేనా..? ఈ ప్రశ్న ఉదయించింది కొత్తగా ఫెళ్లైన యువ జంటలో కాదు. పాతికేళ్లు భర్తతో కలసి సంసారం చేసిన ఓ భార్య మదిలో.. ఇన్నాళ్ల... Read more