ఇంతకాలం నిజాయితీగా బతికి ఇప్పుడు మీ వల్ల మేమంతా అభాసు పాలయ్యాం.. ''అంటూ సీనియర్ ఐఎఎస్ అధికారిణి కత్తి రత్నప్రభ వైసిపి నేత జగన్పై నిప్పులు చెరిగారు. రెండు రోజుల కిందట ఇందుటెక్ జోన్ కేసులో నిందితురాలిగా నాంపల్లి కోర్టుకు రత్నప్రభ హజరై తిరిగి వెళుతునప్పుడు జగన్ను చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ కేసులో జగన్మోహన్రెడ్డితో పాటు రత్నప్రభ కూడా నిందితురాలిగా ఉన్నారు.
కోర్టులో ఓ వైపున రత్నప్రభ, మరో వైపున జగన్ తదితరులు నించొని విచారణ అనంతరం కోర్టు బయటకు వచ్చిన తర్వాత పరస్పరం ఎదురు పడ్డారు. జగన్ను చూడగానే ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. "ఏంటండీ ..ఇది..?..వాటీజ్ దిస్ నాన్సెన్స్ ..మీరెవరో నాకు తెలియదు.. ఎప్పుడు చూడనూ లేదు.. మీతో మాట్లాడిందీ లేదు. కానీ మీ వల్ల మేమందరం సమస్యల్లో పడిపోయాం..ఈ గొడవలతో మాకేమి సంబంధం లేదు.. మాకెందుకీ సమస్యలు.. మీ కారణంగా మేమందరం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది..'' అంటూ తీవ్ర స్వరంతో వాగ్వాదానికి దిగడంతో జగన్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
అక్రమాస్తుల కేసులో అనేక పర్యాయాలు కోర్టుకు హాజరైన జగన్ ఇవే కేసుల్లో సహ నిందితులుగా ఉన్న ఆనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులను కోర్టు ఆవరణలోనే కలుసుకున్నారు.. కానీ ఇంతవరకూ ఆయనకు ఇలా ఎవరూ షాక్ ఇవ్వలేదు.. వాస్తవానికి రత్నప్రభ గురించి జగన్కు కూడా పెద్దగా తెలియదు. విచారణకు హాజరై తిరిగి వస్తున్నప్పుడు ఎదురుపడి దుమ్ము దులిపేయడంతో ఆయన కాసేపు నిశ్చేష్టుడయ్యాడు. అన్నీ సర్ధుకుంటాయి.మేడమ్.. మంచి రోజులు వస్తాయి. కావాలనే ఇదంతా చేశారు.
అని ఆయన సమాధానం చెబుతుండగా.. ఆమె ఇవేమి పట్టించుకోకుండా ఏమిటి వచ్చేది..అంటూ సీరియస్గా వెళ్ళిపోయారు. రత్నప్రభ తండ్రి కత్తి చంద్రయ్య ఐఎఎస్ అధికారి. చంద్రయ్య ప్రకాశం జిల్లా వాసి అయినప్పటికీ ఆమె మాత్రం హైదరాబాద్లోనే విద్యాభ్యాసం చేశారు. కర్ణాటక కేడర్కు ఐఎఎస్కు ఎంపికైన రత్నప్రభ సొంత రాష్ట్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కొంత కాలం డిప్యూటేషన్లో పనిచేశారు. ప్రతిభావంతురాలే కాకుండా నిజాయితీ పరురాలిగా ఆమెకు ఐఎఎస్ సర్కిల్స్లో మంచి పేరుంది.
కర్ణాటకలో కానీ..కేంద్ర సర్వీసుల్లో కానీ..పని చేసినప్పుడు ఎప్పుడూ.. ఎక్కడా ఏ విధమైన ఆరోపణలు ఎదురుకాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటేషన్పై పనిచేసిన సమయంలో వైఎస్ పుణ్యమా అని ఇందుటెక్జోన్కు భూ కేటాయింపుల వివాదంలో సిబిఐ విచారణ ఎదుర్కొని నిందితురాలిగా చేరారు. డిప్యూటేషన్ గడువు ముగిశాక ఆమె ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో జాయింట్ సెక్రటరీ హోదాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఉన్నత కుటుంబంలో జన్మించి హుందాగా బతికిన తాను ఇలా కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడంతో ఆమె ఆగ్రహానికి, ఉద్వేగానికి లోనయ్యారు. జగన్తో వాగ్వాదం తర్వాత ఆమె ఆగ్రహాన్ని చూసిన ఆమె సన్నిహితులు ఇలా మాట్లాడారేంటి అని అడిగినప్పుడు కూడా ఆమె అంతే బదులిచ్చారు. ఈ వ్యవహారంలో తాము చేసిన తప్పేమి లేదని.. నిబంధనల ప్రకారమే చేసినప్పటికీ ఇలా కేసుల్లో ఇరుక్కోవాల్సి రావడం బాధ కలిగించిందని ఆమె అన్నారు. "నేనే కాదు..నా సహచర అధికారులు కూడా ఎంత బాధకు గురవుతున్నారో వాళ్ళకీ తెలియాలి కదా.. ఇలా మేము కోర్టుల చుట్టూ తిరుగుతుంటే మా భవిష్యత్ ఏమిటి.. మా పదోన్నతులు దెబ్బతింటాయి కదా..? బాధను ఎందుకు దిగమింగుకోవాలి..'' అని బదులిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more