డిజిపి దినేష్రెడ్డి పదవీ విరమణ అంశం చర్చనీయంగా మారింది. నిబంధనల ప్రకారం ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన 1977 బ్యాచ్ కి చెందిన ఐపిఎస్ అధికారి. అయితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం తనకు మరో సంవత్సరం డిజిపి హోదాలో కొనసాగే అవకాశం ఉందని దినేష్రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశ్సింగ్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, మార్గదర్శకాలు తనకూ వర్తిస్తాయని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. 2011 జూన్ నెలలో దినేష్రెడ్డి డిజిపి హోదాలో బాధ్యతలు చేపట్టారు. మరో సీనియర్ అధికారి గౌతంకుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దినేష్రెడ్డికి ప్రతికూలంగా తీర్పు వచ్చింది. దీంతో 2012లో ఆయనను అపద్ధర్మ డిజిపిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కొత్త డిజిపి నియామకానికి తాజా జాబితాను పంపించే సమయానికి ఆయనకంటే సీనియర్లంతా పదవీ విరమణ చేయడం, అదే బ్యాచ్కు చెందిన మరో అధికారి ఉమేష్కుమార్ కేసుల్లో ఇరుక్కోవడంతో మళ్లీ దినేష్రెడ్డిని నియమిస్తూ 2012 సెప్టెంబరు నెలలో ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి నుంచి రెండేళ్ల పాటు అంటే 2014 సెప్టెంబరు వరకు తనను కొనసాగించాలని దినేష్రెడ్డి క్యాట్ను ఆశ్రయించారు.
ప్రతికూలంగా మారిన సీమాంధ్ర ఉద్యమం
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దినేష్రెడ్డికి ప్రతికూలంగా మారాయి. ఒకపక్క సీమాంధ్ర ఉద్యమం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అధికార పార్టీకి చెందిన పలువురు తెలంగాణ నేతలు దినేష్రెడ్డిని కొనసాగించేందుకు వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్రకు చెందిన దినేష్రెడ్డి అక్కడి ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోపక్క ఉమేష్కుమార్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దినేష్రెడ్డి ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సిబిఐ కేసు నమోదు చేసింది. మరోపక్క డిజిపి దినేష్రెడ్డిపై మీడియాలో వచ్చిన కథనాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పదవీ విరమణ సమయంలో దినేష్రెడ్డికి అన్ని వైపుల నుంచి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అంశం చర్చనీయాంశంగా మారింది. క్యాట్ ముందు ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అడ్డుకుంటాం..
సినిమా విడుదలకు ముందే పైరసీ భూతంతో బెంబేలెత్తుతున్న 'అత్తారింటికి దారేది' సినిమాకి మరో అడ్డంకి ఏర్పడింది. ఈ సినిమాను అడ్డుకుంటాం అంటూ ఉస్మానియా యూనివర్శిటీ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. ఈరోజు ఓయూలో జేఏసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. అనంతరం ఓయూ జేఏసీ ఛైర్మన్ కరాటే రాజు, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు నెహ్రూ నాయక్, ఓయు అధ్యక్షుడు రవిలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటును తరచూ అడ్డుపడుతున్న కేంద్ర మంత్రి చిరంజీవి వైఖరికి నిరసనగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా 'అత్తారింటికి దారేది'ని అడ్డుకుంటామని వారు తెలిపారు. మొదట సామాజిక న్యాయం అని ప్రగల్భాలు పలికిన చిరంజీవి మాట మార్చి 1500 మంది తెలంగాణ విద్యార్థుల మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ సినిమాను ప్రదర్శించొద్దని థియేటర్ల యాజమానులకు విజ్ఞప్తి చేశామన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సినిమాను కొనొద్దని హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more