రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏ తప్పు చేయలేదని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీ వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్జీవోలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని, రాజకీయాలు చేయొద్దని సూచించారు. యాత్రలు చేస్తున్నవారిని నిలదీయండని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ, వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్ర ఎమ్మెల్యేలు డ్రామా అడుతున్నారని కొండ్రు మురళీ విమర్శించారు. ముందు మీ పార్టీలలో సమైక్యరాష్ట్ర తీర్మానం చేయించాలని, ఆ తర్వాత విభజన జరగకుండా మేం చూస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీలు లేఖలు ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేసిందని కొండ్రు స్పష్టం చేశారు.
భయపడేది లేదు
రాష్ట్ర విభజన అంశంపై సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఎలాంటి ఎస్మాలకు భయపడేది లేదని, అన్నిటికి తెగించే బయటకు వచ్చామని సీమాంధ్ర మహిళా ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ ఉదయం ఎల్ బ్లాక్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు బైఠాయించగా, జే బ్లాక్ వద్ద తెలంగాణ ఉద్యోగులు నిరసన చేపట్టారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి సీమాంధ్రలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఛైర్మన్ మురళీ ఆవేదన వ్యక్తం చేస్తూ నిరవధిక సమ్మెలో పాల్గొంటామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more