కేంద్ర ప్రభుత్వం మరోమారు పెట్రోల్ బాంబు పేల్చింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 2.35 పైసలు పెంచగా, లీటరు డీజిల్ ధర 50 పైసలు వరకు పెరిగింది. పెంచిన పెట్రోల్ కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్ ధర పెంచేందుకు ఆయిల్ కంపెనీలకు అనుమతినిచ్చి ప్రజలపై భారం మోపింది. దీంతో పెట్రోల్ వాహనదారులందరిపై పెనుభారం పడనుంది. పెట్రల్ ధరను లీటరుకు రూ.2.35 పైసలు పెంచాలని ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి. రూపాయి విలువ పడిపోయినందున, ముడి చమురు ధరలు పెరిగినందు వల్ల పెట్రోల్ ధర పెంచాలని ప్రభుత్వ చమురు కంపెనీలు అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచనున్నట్టు తెలుస్తోంది.
వైఎస్ భారతి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఆరోగ్యం విషయంలో నిన్న, ఈరోజు మధ్యాహ్నం తాము భయపడినట్లు ఆయన సతీమణి వైఎస్ భారతి చెప్పారు. నిమ్స్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి కూడా డాక్టరేనని చెప్పారు. దీక్ష విరమించనని తాము ఎంత చెప్పినా జగన్ విరమించలేదన్నారు. ఆ తరువాత జగన్ ఆరోగ్యం విషయంలో తాము చాలా ఆందోళన చెందినట్లు తెలిపారు. కోర్టు ఆర్డర్ తీసుకువచ్చి చూపించి వైద్యులు బలవంతంగా జగన్ ఆమరణదీక్షను భగ్నం చేసినట్లు తెలిపారు. పల్స్ రేటు పడిపోయినా, కిడ్నీలు దెబ్బతింటాయని చెప్పినా భయంలేదా అని డాక్టర్లు జగన్ ను అడిగినట్లు చెప్పారు. 'స్పందించవలసినప్పుడు స్పందిచాలి గదా' అని జగన్ అన్నట్లు ఆమె తెలిపారు. 8 నుంచి పది మంది డాక్టర్లు వచ్చి జగన్ కు బలవంతంగా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు చెప్పారు. తన ముందు జగన్ కు మూడు సెలైన్ బాటిళ్లు ఎక్కించినట్లు తెలిపారు. ఏడు రోజుల నుంచి ఆహారం తీసుకోనందున ఇప్పుడు వెంటనే ఆహారం పెట్టరని చెప్పారు. డాక్టర్లు అందరూ మంచివారేనని చెప్పారు. ఎక్కడైనా డాక్టర్లు పేషెట్స్ ని బాగానే చూస్తారన్నారు. అయితే ఇప్పుడు ఎలాంటి భయంలేదని వైఎస్ భారతి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more