నగరంలో టెస్టు క్రికెట్ సందడి మొదలైంది. వచ్చే నెల 2 నుంచి 6 వరకు ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది. ఈ మ్యాచ్ చూసే ప్రేక్షకుల కోసం మంగళవారంనుంచి టికెట్లు అమ్మనున్నారు. చెన్నై టెస్టులో భారత్ దూకుడు, నగరంలో తొలిసారి ఆసీస్ టెస్టు ఆడుతుండటంతో మ్యాచ్పై అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఎక్కువ ప్రాంతాల్లో టికెట్లు అందుబాటులో ఉంచేందుకు హెచ్సీఏ ఇ-సేవా కేంద్రాల సంఖ్యను భారీగా పెంచింది. అయితే ఇటీవల నగరంలో జరిగిన ఘటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో హెచ్సీఏ అధ్యక్షుడు జి. వినోద్, కార్యదర్శి ఎంవీ శ్రీధర్ టికెట్ల వివరాలను వెల్లడించారు. స్టేడియంలోని నార్త్, సౌత్ స్టాండ్ల వైపు కనోపీ (పై కప్పు) నిర్మాణం పూర్తయింది. ఫలితంగా తొలిసారి ఈ స్టాండ్స్లో ప్రేక్షకులు ఎండ బారిన పడకుండా మ్యాచ్ను తిలకించే అవకాశం ఉంది. కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు హెచ్సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ చెప్పారు. అయితే మ్యాచ్కు రెండు రోజుల ముందు పోలీసులు ప్రేక్షకుల కోసం మరిన్ని సూచనలు ఇస్తారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ సంయుక్త కార్యదర్శి పురుషోత్తమ్ అగర్వాల్, ఉపాధ్యక్షుడు యాదగిరి, మీడియా మేనేజర్ జెరార్డ్ కార్ పాల్గొన్నారు.
టికెట్లు లభించే ఇ-సేవా కేంద్రాలు
ఏఎస్ రావు నగర్, అల్వాల్, బంజారా హిల్స్, చందానగర్, చిక్కడపల్లి, దిల్సుఖ్నగర్, దోమల్గూడ, గ్రీన్ల్యాండ్స్, హరిహర కళాభవన్, హబ్సిగూడ, కర్మన్ఘాట్, ఖైరతాబాద్, కేపీహెచ్బీ, కూకట్పల్లి, మలక్పేట్, మారేడుపల్లి, మీర్పేట్, మింట్ కాంపౌండ్, మియాపూర్, మోతినగర్, ముషీరాబాద్, నల్లకుంట, నేరేడ్మెట్, ప్యారడైజ్, రామంతాపూర్, రాంనగర్, రేతిబౌలి, ఎస్ఆర్నగర్, సనత్నగర్, సరూర్నగర్, సీతాఫల్ మండి, స్నేహపురి, సుల్తాన్ బజార్, తిరుమలగిరి, వనస్థలిపురం, గౌలిపుర.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more