నితిన్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పటికే ‘హార్ట్ ఎటాక్’ వంటి బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
కానీ ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవలే నితిన్ తన సోషల్ మీడియా ద్వారా త్వరలోనే మళ్లీ పూరీతో ఓ సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ‘టెంపర్’ తర్వాత జోరు మీదున్న పూరీ... ప్రస్తుతం ఛార్మితో ‘జ్యోతిలక్ష్మీ’ అనే హాట్ రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పూరీ, నితిన్ ల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రానికి ‘మా అమ్మ సీతమాలక్ష్మీ’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more