నందమూరి ఫ్యామిలి గురించి తెలియని వారు తెలుగు రాష్ర్టాల్లో ఎవరూ ఉండరు. అంత ఫేమస్ ఆ ఫ్యామిలీ అంటే. వారి గురించి ఏం జరిగినా టాలీవుడ్ మొత్తం చర్చ జరగుతుంది. ఇప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీ గురించే ఇండస్ర్టీలో చర్చ జరుగుతోంది. అదే బాబాయ్.., అబ్బాయ్ గురించి. వివరాల్లోకొస్తే.., నాలుగు రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ లో బాలకృష్ణ బైక్ పై నుంచి కిందపడి గాయపడ్డ విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ ఆరోగ్యంపై స్పందించారు. అభిమానులెవరూ ఖంగారు పడవద్దు.., బాబాయ్ క్షేమంగా ఉన్నాడని చెప్పాడు. త్వరలోనే సింహం గర్జిస్తుందని అభిమానులకు భరోసా ఇచ్చాడు. అయితే ఇంతకీ ఎన్టీఆర్ చెప్పింది ఎక్కడ అంటే ట్విట్టర్ లో. బాబాయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
ఇంతకీ హైదరాబాద్ లోనే ఉన్న బాబాయ్ ను చూడటానికి ఎందుకు వెళ్ళలేదు? స్వయంగా కలిసి ఆరోగ్యంపై ఆరా తీయకుండా ట్విట్టర్ లో పోస్ట్ చేయటం ఏమిటి? ఇప్పుడు ఇండస్ర్టీ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. ఇటీవల నందమూరి కుటంబమంతా కలిసి కన్పించిన సంఘటనలు అరుదుగా చెప్పవచ్చు. మామూలుగా అయితే ఏదో పనిలో ఉంటారులే అనుకోవచ్చు కానీ.., ప్రమాదంలో గాయపడిన సమయంలోనూ వెళ్ళకపోవటమేంటని అంతా గుసగుసలాడుతున్నారు. నందమూరి కుటుంబం మద్య ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్పే మాటలు అప్పటివరకేనని దీనితో మరోసారి నిరూపితమైంది. ఇవి ఇప్పటివి కాకపోయినా ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టంగా కన్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్ళి బాలయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని జాగ్రత్తగా ఉండమని సూచించి వచ్చారు. అన్ని పనుల మద్య ఉన్న ఆయనే వెళ్ళగా ఎన్టీఆర్ ఎందుకు వెళ్ళలేదు.
మేలో జరిగిన ఎన్నికల సమయంలోనూ నందమూరి ఫ్యామిలీ ఎక్కడా కలిసి ప్రచారం చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. తండ్రి హరికృష్ణను చంద్రబాబు పక్కనపెట్టి... బాబాయ్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంతో పాటు... పార్టీలో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో హరితో పాటు ఎన్టీఆర్ కూడా కినుక వహించారు. దాంతో ఎన్నికల ప్రచారానికి కూడా వారు దూరంగా ఉన్నారు. పిలిస్తే తాను పార్టీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాదు 'ప్రచారం చేయాలని ఎవ్వరినీ బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఇదేమి ఇంట్లో పెళ్లికాదు' అని బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరి మద్య సఖ్యత లేదని అప్పుడే స్పష్టమయింది. అయితే అవి తొలగిపోతాయనుకున్న నందమూరి అభిమానుల ఆశలు మాత్రం తీరటం లేదు. ఎన్టీఆర్ స్వయంగా వెళ్ళకపోయినా.., ట్విట్టర్ ద్వారా తామంతా కలిసే ఉన్నట్లు అబిమానులకు సంకేతాలిస్తున్నాడు. మరి ఈ ట్విట్టర్ సందేశానికి బాలయ్య స్పందిస్తాడో లేదో వేచి చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more