బాలీవుడ్ లో డర్టీ భామగా పేరు తెచ్చుకున్న హాట్ బ్యూటీ విద్యాబాలన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ‘సిద్దార్థ రాయ్ ’ ని 2012 డిసెంబర్ 14వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందు అంటే రెండేళ్ల క్రితం ‘ఫెరారీ కీ సవారీ ’ చిత్రంలో ఐటెం పాటకు చిందేసి ఆ పాటను రక్తికట్టించడమే కాకుండా ఆ పాట సినిమాకు హైలెట్ గా నిలిచింది. పెళ్లయ్యింది కదా వాటికి దూరంగా ఉంటేనే బాగుంటుందేమో ? అని అనుకుందో ఏమో కానీ ఇఫ్పుడు అభిమానులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది.
ఇక పై ఐటెం పాటల్లో నటించేది లేదని తెగేసి చెప్పింది. అంతే కాకుండా ఐటెం పాటలతో ఒరిగేది ఏమీ లేదు, అందులో నటిస్తే అందాలు ఆరబోయడం తప్పితే ఆనందం మిగలడం లేదని ఫీలయ్యే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది. ఈమె నిర్ణయం ఇఫ్పుడు బాలీవుడ్ జనాల్ని ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం సినిమాల్లో ఐటెంపాటకు మంచి డిమాండ్ ఉంది. అదీ కాకుండా హీరోయిన్ తో సమానంగా పారితోషిక అందటమే కాకుండా, పేరు కూడా అదే స్థాయిలో వస్తుంది. గత సినిమాల్లో కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా , సోనాక్షి వంటి యంగ్ హీరోయిన్స్ చేయడానికి క్యూ కడుతుంటే.. అలాంటి ఐటెం పాటం పాటలతో ఏం ప్రయోజం లేదని చెప్పడం ఆశ్యర్యంగా ఉందని అంటున్నారు.
అగ్రతారలు ఐటమ్ సాంగ్స్ చేస్తే పారితోషికం భారీ ఎత్తున ఉంటుంది. అందులోనూ విద్యాబాలన్ వంటి తారలకైతే కోట్లివ్వడానికి కూడా నిర్మాతలు వెనకాడరు. కానీ, విద్యా మనసు ఆ కోట్లకు కరగడంలేదట. ఈమె నిర్ణయం చూస్తుంటే ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. తన భర్త సిద్దార్థ్ రాయ్ బాలీవుడ్ అమ్మాయిలతో సన్నితంగా మెలుగుతున్నాడని, తన ఇంట్లోలేని సమయంలో కులుకుతున్నాడని విద్యాకు తెలిసి విడాకులు ఇవ్వడానికి సిద్దం అయిందని వార్తలు వచ్చాయి.
ఈ వార్తల తరువాత సిద్దార్థ్ కూడా విద్యాకి కొన్ని కండిషన్లు పెట్టాడని, వెండితెర పై అందాలు ఆరబోయడం, బికినీల వేసుకోవద్దని, ఐటెంసాంగుల్లో నటించకూడదని చెప్పడంతో తన కాపురాన్ని పదికాలల పాటు పచ్చగా ఉంచుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more