పూజా(మీనాక్షి చౌదరి) ఇంటెలిజెన్స్ ఐజీ జయరామ్(సచిన్ ఖేడ్కర్) కుమార్తె. చాలా తెలివైన అమ్మాయి. క్రిమినల్ సైకాలజీ చదువుతుంటుంది. ఓ థీసెస్ కోసం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మోహన్ గాంధీ(రవితేజ)ని కలుస్తుంది. హోం మంత్రి గురుసింగం(ముఖేష్ రుషి) రూ.10వేల కోట్లకు సంబంధించిన లావాదేవి వల్ల తానెలా సమస్యల్లో చిక్కుకున్నది, కుటుంబాన్ని పోగొట్టుకుని చేయని నేరానికి జైలుకు ఎలా రావాల్సి వచ్చింది.. ఓ కట్టుకథలా ఆమెకు చెప్తాడు. ఆ కథ నిజమని నమ్మిన పూజా.. మోహన్గాంధీకి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరీ అతనికి బెయిల్ వచ్చేలా చేస్తుంది.
సరిగ్గా గాంధీ బయటకు రాగానే అతడి జీవితానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం తెలుస్తుంది. అతడు ఓ అంతర్జాతీయ క్రిమినల్ అని, హోంమంత్రి డబ్బు కొట్టేయడానికే ఇటలీ నుంచి భారత్కు వచ్చాడని, ఇందుకోసం తెలివిగా తనని వాడుకున్నాడని పూజాకు అర్థమవుతుంది. మరి ఆ డబ్బు ఎవరిది? అదెక్కడ దాచారు? ఆ డబ్బుతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఆశపడిన గురుసింగం కోరిక తీరిందా?డబ్బును కొట్టేయాలన్న గాంధీ కోరిక నెరవేరిందా? డబ్బుతో పాటు గాంధీని పట్టుకోవాలన్న సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ (అర్జున్) లక్ష్యం నెరవేరిందా? ఈ మొత్తం కథలో డింపుల్, అనసూయ, ఉన్ని ముకుందన్, మురళీ శర్మల పాత్రలేంటి?అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
రూ. 10 వేల కోట్ల డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా రూపోందించాడు దర్శకుడు రమేశ్ వర్మ. ఓ తెలివిమీరిన దొంగ.. రూ.10 వేల కోట్ల టార్గెట్.. ఆ డబ్బు కోసమే కాచుకు కూర్చొన్న రెండు ముఠాలు.. ఆ డబ్బును, దొంగల్ని పట్టుకు తీరాలనే లక్ష్యంతో తిరిగే సీబీఐ అధికారి.. ఇవన్నీ చూస్తుంటే ఓ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన సరుకంతా ఈ కథలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఓ పసందైన థ్రిల్లర్ చిత్రం తయారీలో మాత్రం సాగదీత.. కథలో ట్విస్టులు సగటు ప్రేక్షకుడి ఊహించినట్లుగానే సాగడంతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగామలచడంలో దర్శకుడు తడబడ్డాడేమో అని అనిపిస్తోంది.
భార్యని, అత్తమామల హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా రవితేజ పాత్రని పరిచయం చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. పూజాకు అతడు తన కథ చెప్పడం ప్రారంభించాక రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా మారిపోతుంది. రవితేజ, డింపుల్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా సాదాసీదాగా ఉంటాయి. నిజానికి సినిమా అసలు కథపై దర్శకుడు అంత దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. గురుసింగానికి సంబంధించిన రూ.10వేల కోట్లను డెవిడ్ ముఠా కొట్టేయడం.. ఈ క్రమంలో వచ్చే ఛేజింగ్ ఎపిసోడ్లతో కథలో కాస్త వేగం పెరుగుతుంది. విరామానికి ముందు మోహన్ గాంధీ పాత్ర అసలు కథను రివీల్ చేయడం.. ఈ సందర్భంగా అర్జున్, గాంధీ పాత్రల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్గా నిలుస్తాయి.
సెకండాఫ్ నుంచి సినిమా పూర్తిగా థ్రిల్లర్ ట్రాక్ ఎక్కినట్లు కనిపించినా.. కాసేపటికే కథ మొత్తం రొటీన్ వ్యవహారంలా మారిపోతుంది. రూ.10 వేల కోట్లు కొట్టేయడం కోసం మోహన్ గాంధీ ముఠా చేసే ప్రయత్నాలు చాలా వరకు సిల్లీగా ఉంటాయి. అయితే మధ్యమధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు కాస్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. థ్రిల్లర్ కథలకు ముగింపు రసవత్తరంగా ఉండాలి. అయితే ఈ చిత్రంలో క్లైమాక్స్ పెద్ద మైనస్. ఊహకందని మలుపులు..ట్విస్ట్లతో.. కథను రూపోందించిన దర్శకుడు సాగదీశాడు.దీంతో క్లైమాక్స్ విసుగు తెప్పించేలా వున్నా.. యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి.
నటీనటుల విషాయానికి వస్తే..
నాని ఇటు వాసుగా, అటు శ్యామ్ సింగరాయ్ గా రెండు పాత్రలతోనూ సహజంగా సెట్ అయ్యాడు. పెర్ఫామెన్స్ పరంగా సవాలు విసిరే ఏ కొత్త పాత్ర ఇచ్చినా.. అందులో సులువుగా ఒదిగిపోయి.. ఆశ్చర్యపరుస్తాడు. శ్యామ్ సింగ రాయ్ గా నాని ఆహార్యం మొదలుకుని.. నటన వరకు అన్నీ ఆకట్టుకుంటాయి. నాని కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఆద్యంతం అతను ఆకట్టుకున్నాడు. వాసు పాత్ర సాధారణంగా అనిపించడంతో నటన పరంగా నాని కొత్తగా చేయడానికేమీ లేకపోయింది. నాని తర్వాత ఆటోమేటిగ్గా ఎక్కువ స్కోర్ చేసేది సాయిపల్లవినే. మైత్రి పాత్రకు అమె తనదైన అభినయంతో వన్నెతెచ్చింది.
ఆమె తెరపై కనిపించిన తొలి మూమెంట్ నుంచి ప్రేక్షకులను కట్టిపడేసేలా వుంది. చిన్న చిన్న హావభావాల విషయంలోనూ సాయిపల్లవి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే ఇండస్ట్రీ మెచ్చిన నృత్యకారిణిగా పేరుతెచ్చుకున్న ఆమె.. ఈ చిత్రంలోనూ కొత్త మూవ్ మెంట్స్ వేసి.. తనకు తానే సాటి అని చాటుకుంది. దేవదాసి పాత్రలోని సంఘర్షణను ఆమె సరిగ్గా చూపగలిగింది. తన నాట్యంతోనూ సాయిపల్లవి మెప్పించింది. కృతి శెట్టి జస్ట్ ఓకే అనిపిస్తుంది. తొలి సినిమాలో మాదిరి ఇందులో పెద్దగా ఆకర్షించలేకపోయింది. మడోన్నా సెబాస్టియన్ బాగానే చేసింది కానీ.. ఆమె మరీ జీవం కోల్పోయినట్లు కనిపించింది. రాహుల్ రవీంద్రన్ తన పాత్రకు న్యాయం చేశాడు. జిష్ణు సేన్ గుప్తా ఓకే. అభినవ్ గోమఠం బాగా చేశాడు.