నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం .. అందులో చికెన్ ముక్క ఉంటే మహా ఇష్టంగా తింటాను అని చెప్పే నాయకుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ. ఆయన డిఫరెంట్ గా నిరసనలు తెలుపుతుంటాడు. ఒకచోట కల్లు తాగుతాడు, మరోచోట హుక్క తాగుతు కనిస్తాడు. ఆయన స్టైలే వేరుగా ఉంటుందని ఎర్ర జెండా నాయకులు చెబుతుంటారు. ఇటీవల వాన్ ఫిక్ భూములపై రెచ్చిపోయి తన ప్రతాపం కాళ్లతో తన్ని మారీ చూపించాడు నారాయణ. ఇప్పుడు టీడీపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు .. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సంక్షోభం పై ధర్నాలు , ర్యాలీలు చేస్తుంటే.. మన ఎర్ర జెండా నాయకుడు మాత్రం సైలెంట్ గా .. ఫ్యాన్ లేని గదిలో కూర్చొని ఆలోచనలు చేస్తున్నారు. ఆయన ఆలోచన ఏమిటయ్యా అంటే .. అందరి కంటే .. ఢిఫరెంట్ గా ఉండాలనేది ఆయన కోరిక. అందుకే ఇటీవల రాయల సీమ నాయకులు అందరు సమావేశమైన .. తమకు ప్రత్యేక రాయల సీమ కావాలనే వాదనను తెరపైకి తీసుకురావటం జరిగింది.
ఆ వాదన విన్న నారాయణ వెంటనె ప్రత్యేక తెలంగాణ కావాలనే విషయాన్ని నారాయణ ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం సీపీఐ ఆద్వర్యంలో ప్రజా పోరు యాత్ర ప్రారంభించినట్లు తెలుస్తోంది. నారాయణ కొంచెం స్వరం పెంచి.. గట్టిగా తెలంగాణ కోసం అడుగులు వేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులను .. దేశముదుర్లని, కిరాతకులు, దద్దమ్మలు వారి చేప్పే మాటలు నమ్మవద్దని ఆయన తెలంగాణ వాదులకు చెబుతున్నాడట. తమ పార్టీ రాష్ట్రంలో ఒకే మాట ఒకే బాటగా ముందుకు పోతోందన్నారు. ప్రాంతాలవారీగా మాటలు మారచే సిద్దాంతం తమకు లేదన్నారు. అంతేకాకుండ రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వరస్వామిని కూడా వాడుకునే పార్టీ కాంగ్రెస్ అయిన నారాయణ అంటున్నారు. కేవలం మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతిచ్చాడనే కారణంతో ఆదికేశవులను టీటీడీ బోర్డు ను అప్పగించిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని నారాయణ అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ అంశాన్ని నాన్చుతూ కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు నేను డెకాయిట్లు అన్నందుకు కొందరు క్షమాపణ చెప్పాలంటున్నారని, అయితే ఉస్మానియా క్యాంపస్ లో శవాల మీద ప్రమాణం చేసి మాట తప్పిన వారిని డెకాయిట్లనక ఏమనాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న పార్టీలన్నీ రానున్న రోజుల్లో ప్రజాదరణ కోల్పోయి బంగాళాఖాతంలో కలసి పోవడం ఖాయమని .. ఆయన అంటున్నారు. కాంగ్రెస్ నాయకులైతే .. నారాయణ రెచ్చిపోవటం చూసి.. తెలంగాణలో చికెన్ ముక్కలు బాగా దొరికినట్లుగా ఉందని అందుకే ఆయన అలా రెచ్చిపోతున్నాడని .. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో జోకులు వేసుకుంటున్నారట. నారాయణ తెలంగాణ పై చేస్తున్న ప్రజా పోరు యాత్ర ,చూసి మీడియా నాయకులు కూడా నవ్వుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులైతే.. ఎర్ర దండు ఎంత ఎత్తున లేచిన .. చివరకు మా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more