రాష్ట్ర ప్రజలకు అనేక పాపాలు చుట్టుకుంటున్నాయి. ప్రతి రోజు ప్రజలకు పాలతోనే సూర్యోదయం అవుతుంది. ఇప్పుడ ఆ పాల వలనే ప్రజలకు కొత్త కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల అవసరాలను గుర్తించి.. పాల ముసుగులో పాపాలు చేస్తున్న సంస్థ ఒకటి తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.పైకి చూస్తే...చాలా సింపుల్గా కన్పిస్తుంది. అంతేనా అన్పిస్తుంది. లెక్కలేస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఆ కంపెనీకి కోట్ల ఆదాయం. జనం జేబుకు పెద్ద కన్నం. తెలుగుదేశం అధినేత బాబుగారి 'హెరిటేజ్' పాల ప్యాకెట్...చేస్తున్న మాయ ఏమిటో మీరే చూడండి..రూల్స్ గురించి మాట్లాడతారు. అవినీతి అంటూ భీకర ప్రసంగాలు చేస్తారు. తనదాకా వస్తే మాత్రం...సైలెంట్ అయిపోతారు. సాక్షాత్తు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కు చెందిన హెరిటేజ్ డెయిరీ...అటు పాల ఉత్పత్తిదారులకు, ఇటు వినియోదారులకూ శఠగోపం పెడుతోంది. అప్పనంగా యేటా కోట్ల రూపాయలు దండుకుంటోంది. పెరుగుతున్న పశుగ్రాసం, కరెంట్..ఇతర ఖర్చులను భరించి పాడి పశువులను పెంచి పోషించి పాలను ఉత్పత్తి చేస్తున్న రైతులకు- కొత్త వెన్న శాతం విధానం పేరుతో సేకరణ ధరల్లో ఒకవైపు కోత వేస్తోంది. మరోవైపు మార్కెట్లో అందరికన్నా అధిక ధరకు అమ్మే తమ పాల ప్యాకెట్లలో ప్రమాణాల ప్రకారం వుండాల్సిన పరిమాణం కన్నా తక్కువగా పాలను ప్యాకింగ్ చేసి వినియోగదారుల జేబుకూ చిల్లు పెడుతోంది. దీనితోబాటు నాణ్యతను కూడా పక్కన పెడుతున్నట్టు ప్రభుత్వ నాణ్యత పరీక్షల్లో తేలింది. మిల్క్ కమీషనర్ హోదాలో ఎపి డెయిరీ ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రంలోని ప్రధాన డెయిరీల నాణ్యతను పరీక్షిస్తుంది.
ఈ నేపథ్యంలో ఈ నెలలో 14 డెయిరీ పాల ప్యాకెట్లను సేకరించి 21 రకాల పరీక్షలు జరిపింది. ఇక్కడే హెరిటేజ్ డెయిరీ చిలక్కొట్టుడు వ్యవహారం బట్టబయలైంది. ప్రతి రోజూ హెరిటేజ్ సగటున 15 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంటే, అర లీటర్ ప్యాకెట్లో 500 మిల్లీ లీటర్లకు బదులు 496 మిల్లీ లీటర్ల పాలనే ప్యాకింగ్ చేస్తున్నారు. ఒక్కోసారి 494 మిల్లీ లీటర్ల పాలే వుంటున్నాయి. సగటున 5 మిల్లీ లీటర్లు వున్నట్టు లెక్క కట్టినా మొత్తంగా చూస్తే ప్రతి రోజూ 15 వేల లీటర్లకు వినియోగదారులనుంచి హెరిటేజ్ డబ్బులు వసూలు చేస్తోంది. అంటే ఈ మొత్తం నెలకు 1.62 కోట్లయితే ఏడాదికి 19.44 కోట్లవుతుంది. పైగా ప్రాసెస్ చేసిన పాలు సాధారణ వాతావరణంలో గరిష్టంగా అయిదు గంటల వరకు పాడవకుండా వుండాలి. అయితే హెరిటేజ్ పాలు నాలుగున్నర గంటలే వుంటున్నాయి. అంతటితో మాయ ఆగలేదు. రైతులు డెయిరీలకు పోసే పాల ధరలకు అడ్డంగా కోతలు వేసిన హెరిటేజ్..వినియోగదారు విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్లో 10 డెయిరీలు అర లీటరు టోన్డ్ పాల ప్యాకెట్ను 34 రూపాయలకు విక్రయిస్తుంటే ఎపి డెయిరీ ఆధ్వర్యంలోని 'విజయ' ధర 32 రూపాయలుగా వుంది. అదే హెరిటేజ్ అరలీటరు ప్యాకెట్ ధర ఏకంగా 36 రూపాయలుగా వుంది. ఇంకోవైపు రిలయన్స్ సంస్థకు చెందిన డెయిరీ పాలలో ప్రమాదకరమైన కొలిఫాం బ్యాక్టీరియా మోతాదు కన్నా ఎక్కువ వున్నట్టు, అర లీటర్ ప్యాకెట్లో కూడా 494 మిల్లీ లీటర్ల పాలే వున్నట్టు ఎపి డెయిరీ పరీక్షల్లో తేలింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more