వాన్పిక్ అవినీతిలో ఐదవ ముద్దా యిగా సీబీఐ మంత్రి ధర్మాన ప్రసాద రావును నిర్ధారించినందున ముఖ్యమంత్రి వెంటనే ఆయన్ని బర్తరఫ్ చేయాలని కమ్యునిష్ట పార్టీలు అంటున్నాయి మంత్రులను సీబీఐ ముద్దాయిలుగా నిర్ధారిస్తున్నా, కోర్టులు శిక్ష లు విధిస్తున్నా నైతిక బాధ్యత వహించి స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడం లేదని మండిపోడుతున్నాయి. ఒక పక్క వైఎస్ దేవుడంటూ నే, మరో పక్క ఆయన అవినీతితో తమకు సంబంధం లేదని మంత్రులు పసలేని వాదన చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని వారు ద్వజమెత్తారు. వైఎస్ బ్రతికుంటే అవినీతి కుంభకోణాల్లో ఆయన తొలి ముద్దాయిగా నిలిచి ఉండే వారని వారు గుర్తు చేశారు. వాన్పిక్కు భూకేటాయింపుల్లో రెవెన్యూశాఖ ప్రమేయం లేదని మంత్రి ధర్మాన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రెవిన్యూశాఖ ద్వారా రెండు జీవోలు విడుదల చేసి వాన్పిక్కు భూకేటాయిం పులు జరపడంతో పాటు భూములు అప్పగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. జీవో నెంబర్ 1110 ద్వారా 6,493 ఎకరాలు, జీవో నెంబర్ 1115 ద్వారా 5, 451 ఎకరాలు మొత్తం కలిపి 11,944 ఎకరాల భూమిని రెవె న్యూశాఖ ద్వారా వాన్పి్ కు కేటాయించినట్లు జీవోల ద్వారా స్పష్టమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సైతం వేల కొద్ది ఎకరాల అటవీ భూములు వాన్పిక్కు కేటాయించారన్నారు. ప్రభుత్వ సంస్థకే లాభాలకు ఈ భూములను తిరిగి అమ్మాలని ప్రయత్నించి వాన్ పిక్ విఫలమయిందని వివరించారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సంస్థ జెన్కో వెనక్కి తగ్గడంతో వాన్పిక్ రియల్ ఆశలకు గండిపడిందన్నారు.
రైతు లకు నష్టపరిహారం పేరిట ఇచ్చిన 450 కోట్లలో 300 కోట్ల రూపాయలు దళారులు తిన్నారని సీబీఐ నిర్ధారిం చిందన్నారు. రస్అల్ఖైమా ప్రభుత్వం పేరు చెప్పుకుని భూములు కబ్జా చేయడానికి వైఎస్ రాజమార్గాన్ని ఎంచుకు న్నారని మండిపడ్డారు. ఏ ప్రాజెక్టులో రస్అల్ఖైమా రూపాయ పెట్టుబడి పెట్టలేదన్నారు. దోచుకునేవారికి, కబ్జాదారుల కు అండగా నిలిచినందుకు అంతర్జాతీయ కోర్టులో కేసు పెట్టి చ ర్యలు తీసుకోవాలన్నారు. రస్అల్ఖైమా అధినేతను తక్షణమే అరె స్టు చేయాలన్నారు. వాన్పిక్కు కేటాయించిన భూములు స్వాధీనం చేసుకుని తిరి గి రైతులకు పంచాలని డిమాండ్ చేశారు. సీబీఐ మంత్రులపై వరుసగా నేరాలు రుజువు చేస్తున్నందున ఈ ప్రభుత్వం పాలించే హక్కు కోల్పోయిందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావును కేబినెట్ నుండి డిస్మిస్ చేయాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి బీవీ. రాఘవులు డిమాండ్ చేశారు. ఇక్కడి సీపీఎం రాష్ర్ట కార్యాలయంలో ఆయన కొన్ని టీవీ ఛానళ్లు, మీడి యా ప్రతినిధులతో మాట్లాడారు. అవినీతికి పాల్పడిన మం త్రులు, కేసుల్లో ఇరుక్కున్న మంత్రులను అంటిపెట్టుకుని పాలన కొనసాగించడం నిజాయితీ అనిపించుకోదని చెప్పారు. వాన్పిక్ భూముల కేటాయింపుల విషయంలో సోమవారం కోర్టులో ప్రవే శపెట్టిన సీబీఐ ఛార్జీషీట్లో మంత్రి ధర్మాన ప్రసాదరావును ఐదో ముద్దాయిగా పేర్కొన్నారని దీంతో ఆయన కేబినెట్లో ఉండే అర్హత ను కోల్పోయారని అన్నారు. కళంకిత మంత్రులతో కొనసాగుతున్న రాష్ట్ర కేబి నెట్ను ప్రక్షాళన చేయాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. ముందు మంత్రి ధర్మాన కేబినెట్లో ఇంకా కొనసాగడం ధర్మం కాదన్నారు. ధర్మాన్ని కాపాడాలంటే ఆయన ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగ కుండా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ ధర్మాన స్వచ్ఛందంగా రాజీనామా చేయని పక్షంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి జోక్యం చేసుకుని బర్తరఫ్ చేయాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more