వైఎస్ జగన్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ , టిడిపి వణికించేస్తోంది. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ చేతిలో ఓటమి భారంతో తల దించుకున్న కాంగ్రెస్, టిడిపిలో కొత్త వ్యూహంతో ముందుకు సాగే పనిలో ఉన్నారని వార్త. మబ్బుల చాటుకెళ్లాడనుకున్న చంద్రుడు వెళ్లలేదు. మొఖం చాటేస్తాడనుకున్న ఆ చంద్రబాబు కెమెరాలకు నో చెప్పలేదు. అవమానభారంతో క్రుంగిపోతాడునుకున్నాయన ఆత్మవిశ్వాసంతో మళ్లీ ముందుకే చూస్తున్నాడు. గుణపాఠాలు నేర్చుకుంటారనుకున్నాబాబు అసలు పాఠాలవైపే చూడనట్లు కన్పిస్తోంది. కొంతమందిని ఆశ బ్రతికిస్తుంది. అత్యాశ – దురాశాలు చంపేసాయి. ఇంకొంతమందికి అధికారం అచ్చొస్తుంది. మరికొంతమందికి అదే అధికారం పామై కాటేస్తుంది. ఈ చిత్ర విచిత్రాల ప్రపంచంలో బాబు ను బ్రతికిస్తోంది కేవలం రాజకీయమే. బాబుకు రాజకీయమే గాలి-నీరు- సమస్తం. బాబుకు వరుస పరాజయాలు .. కొన్ని ఘోరపరాజయాలు.. మరొకొన్ని పరాజాలు .. ఇటువంటి 9-8 జీవితం బాబుది. అంటే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి వైభోగం.. ఎనిమిదేళ్లు ప్రతిపక్షంలో ముళ్ల ప్రయాణం అందుకే 9-8 అని చెప్పటం జరిగింది. బాబు అధికారంలోకి వస్తారా? అనే మన ఆలోచనెలెలా ఉన్నా బాబు లో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మాత్రం కనిపిస్తుంది. 2014 నాటికి 64 ఏళ్లు వస్తాయి. అయిన బాబు భవిష్యత్తు వైపు ఆశగా చూస్తున్నారు. అంటే ఏదో మర్మం ఉంటుందని టీడీపీ నాయకులు అంటున్నారు.
ఉప ఎన్నికలలో నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టడం కూడా తెలుగుదేశం పార్టీ కొంప ముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి ఘోర పరాజయం చవిచూసింది. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పదిహేను స్థానాలలో గెలుపొందగా, కాంగ్రెసు రెండు స్థానాలను కైవసం చేసుకొని పరువు నిలుపుకుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్క స్థానంలో కూడా గెలవకుండా పరువు పోగొట్టుకుంది. గత మూడేళ్లుగా జరుగుతున్న ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోక పోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే ఉంటే 2014లో పార్టీ అధికారం కైవసం చేసుకోవడం కష్టమని చెబుతున్నారు. ఇందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని కూడా కొందరు తప్పు పడుతున్నారని అంటున్నారు. నందమూరి హీరోలూ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లను ఉప ఎన్నికలలో ఉపయోగించుకోవడం పార్టీని తీవ్రంగా దెబ్బ తీసిందని అంటున్నారు.
ఉప ఎన్నికలలో వారిని రంగంలోకి దింపక పోవడం వల్ల నందమూరి - నారా కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే అని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చిందని, ఇది ఉప ఎన్నికలలో దెబ్బ తీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రౌడ్ పుల్లర్స్ అయిన బాలయ్య, జూనియర్ల సేవలు వినియోగించుకుంటే బావుండేదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలకు ముందు బాలయ్య పార్టీకి అవసరమైనప్పుడు తన సేవలు తప్పకుండా అందిస్తానని చెప్పారు. ఆయన మొదటి నుండి అదే విషయాన్ని చెబుతున్నారు. విభేదాలు ఉన్నాయనే మాట ఉన్నప్పటికీ జూనియర్ కూడా పార్టీకి అవసరమైనప్పుడు తాను వెళతానని చెప్పారు. వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు వారిని ఉప ఎన్నికల ప్రచారానికి పిలిస్తే బావుండేదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. వారి వ్యాఖ్యలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా తానొక్కడే ప్రచారం చేయడం వల్లనే ఫలితాలు పూర్తి నిరాశపర్చే విధంగా ఉన్నాయని అంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలలో చంద్రబాబు ఒంటెత్తు పోకడలకు వెళ్లకుండా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లను రంగంలోకి దింపి ఉంటే బాగుండేదని అంటున్నారు. అయితే నందమూరి కుటుంబాన్ని రంగంలోకి దింపాల్సినంత ఇంపార్టెన్స్ ఉప ఎన్నికలకు లేదని టిడిపిలోని మరికొన్ని వర్గాలు భావిస్తున్నాయని అంటున్నారు. అయితే వారిని దింపాల్సినంద ఇంపార్టెన్స్ ఉన్నా లేకున్నా ప్రతిష్టాత్మకమైన పోరులో పరువు కోసం వారిచే ప్రచారం చేయిస్తేనే బాగుండేదని అంటున్నారు.
అందుకు చంద్రబాబు సరికొత్త పథకం వేసినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలను.. తన కొడుకు లోకేష్ చేతిలో పెడితే.. చాలా విమర్శలు రావటం ఖాయమని తెలిసిపోయింది. దీనివలన పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి.. అటు నందమూరి కుటుంబానికి .. ఇటు నారా కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇచ్చే యోచనలో బాబు ఉన్నట్లు పార్టీ నాయకులు అంటున్నారు. నందమూరి ఎన్టీఆర్ కొడుకు బాలయ్య కూతురు అయిన బ్రహ్మణి. చంద్రబాబు కొడుకు భార్య అయిన బ్రహ్మణి. స్వయన చంద్రబాబుకు కొడలు. అయితే ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు బ్రహ్మణీ చేతిలో పెట్టే యోచనలో ఉన్నట్లు పార్టీ నాయకులు అంటున్నారు.
కొడుకు లోకేష్ ను బిజినెస్ లో పెట్టి కొడలు బ్రహ్మణీకి పార్టీ పగ్గాలు ఇవ్వటంతో .. అన్ని సమస్యలు తీరుతాయని బాబు ఆలోచిస్తున్నాడట. బ్రహ్మణీకి మంచి అందం ఉంది. చదువు ఉంది. అటు ఎన్టీఆర్ మనవరాలు అన్న పేరు ఉంది. బ్రహ్మణీకి మంచి మాట తీరు కూడా ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. బ్రహ్మణీ చేతికి పార్టీ పగ్గాలు ఇవ్వటపై నందమూరి కుటుంబం నుండి ఎలాంటి ఒత్తిడి రాదని చంద్రబాబు తన పార్టీ నాయకులతో అంటున్నాడట. అంతేకాకుండా.. ఇప్పుడు రాజకీయాల్లో.. కాంగ్రెస్ పార్టీ నుండి పురంధేశ్వరి , ఉత్తర ప్రదేశ్ సిఎం భార్య డింపుల్ లాంటి మహిళ నాయకులే రాజకీయాల్లో రాణిస్తున్నారనే వాదన బాబు నోట వినబడుతుంది.
మొన్న రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలోకి దిగిన వైఎస్ విజయమ్మ, షర్మిల లాంటి మహిళలే విజయం సాధించారని బాబు అంటున్నాడట. తన కొడల్ని రాజకీయాల్లోకి తేవటవం వలన .. నందమూరి కుటుంబం నుండి ఎలాంటి అభ్యంతరాలు రావనే బాబు పార్టీ నాయకులతో అంటున్నాడట. ఎన్టీఆర్ మనవరాలు కాబట్టి ప్రజలు బాగా ఆదరిస్తారని చంద్రబాబుతో పార్టీ నాయకులు అంటున్నారట. అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ లో .. కొడలి పెత్తనం రాబోతుందని పార్టీ లో సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more