చిరంజీవి పై పగ జగన్ కు ఇప్పటిది కాదట. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుండి జగన్ పగ పట్టినట్లు సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. 2004లో ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజరాజ్యం పార్టీ పెట్టి రాష్ట్రం లోకల్ పార్టీగా పరిచయం చేయటం జరిగిందట. మెగా స్టార్ కు ఇన్న ఇమేజ్ తో పార్టీ ని స్థాపించి ప్రజలకు సేవా చేయాలని, రాష్ట్రంలో సామాజిక న్యాయం తీసుకురావాలని చిరంజీవి చిత్తశుద్దితో రాజకీయ ప్రవేశం చేయటం జరిగిందట. కానీ అప్పటి నుండే చిరంజీవి జగన్ ఒక కన్ను వేసినట్లు సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఎలాగైన, ఎప్పటికైన చిరంజీవిని రాష్ట్రంలో బలహీనపరచాలి అనే నినాదంతో.. జగన్ తన కొత్త కొత్త పథకాలను .. ప్రవేశ పెట్టినట్లు మెగా అభిమానులు అంటున్నారు. చిరు పార్టీలోకి వచ్చిన వలస నాయకులను నమ్మటం, పార్టీలోనే శత్రువులు ఉన్నారు అనే విషయాన్ని చిరంజీవి గ్రహించలేకపోయాడట. అంతేకాకుండా .. రాజకీయాలు కొత్త కావటంతో , రాజకీయ ఎత్తులు చిరుకు తెలియకపోవటంతో.. చిరు అనుకున్న విజయం రాలేదట. దీని వెనక వైఎస్ జగన్ హస్తం ఉందని సీనియర్ నాయకులు అంటున్నారు. చిరు పార్టీలోని కొంతమంది నాయకులకు జగన్ ఇచ్చే డబ్బులకు ఆశపడి పార్టీలోని రహస్యలను .. జగన్ చెప్పటం జరిగిందని మెగా అభిమానులు అంటున్నారు. కుట్రతో , కుతంత్రాలతో కూడుకున్న జగన్ తెర వెనక రాజకీయం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జగన్ వేసి కుట్ర రాజకీయంలో చిరు పార్టీ బలహీనపడిందని పీఆర్పీ నాయకులు అంటున్నారు.
జగన్ చిరు పార్టీ బలహీన పడుతుందని తెలిసి చంకలు కొట్టుకొని సంబరాలు చేసుకున్నాడని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో.. చిరంజీవి ప్రజరాజ్యం పార్టీ ని కాంగ్రెస్ విలీనం చేయటంతో.. జగన్ కోరిక నేరవేరిందని మెగా అభిమానులు అంటున్నారు. అయితే .. ఇక్కడే చిరంజీవి స్టార్ మారిందనే విషయం జగన్ గ్రహించలేకపోయాడట. కాంగ్రెస్ చేరిన చిరు .. తన ఎమ్మెల్యే కు మంత్రి పదవులు ఇప్పించి, తన శాసన సభ్యుడుగా ఎన్నిక కవటంతో.. జగన్ ఒక్కసారి గా షాక్ తిన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా చిరంజీవి ప్రత్యేకమైన హోదాను కల్పించి కాంగ్రెస్ లో ముఖ్య నాయకుడిగా ప్రకటన చేయటంతో.. జగన్ కు దిమ్మతిరిపోయిందట. రోజు రోజుకు చిరంజీవి ఇమేజ్ రాష్ట్రంలో పెరిగిపోవటంతో.. జగన్ చిరుపై మరో కొత్త పథకం వేశాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిరంజీవిపై ఆధారపడటం జరిగింది. ఉప ఎన్నికల ప్రచారంలో చిరంజీవి వాడి వేడిగా ఉప ఎన్నికల ప్రచారం జరుగుతుంటే.. జగన్ మాత్రం .. చిరంజీవి సభలకు జనం ఎవరు రావటంలేదు, ఉప ఎన్నికలలో చిరంజీవిని నాయకులు రావద్దంటున్నారని, తన మీడియా, పేపర్లలో రాసుకుంటు, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడటని మెగా అభిమానులు అంటున్నారు. చిరంజీవి పై కొత్త కొత్త విమర్శలు చేస్తూ చిరంజీవి ఇమేజ్ బలహీన పరచటానికి శతవిదాల ప్రయత్నం చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపి అయిన లగడపాటి పై కూడా జగన్ కుట్ర సాధిస్తున్నాడు. షర్మిలా రెండో పెళ్లి విషయం మరిచిపోయి ..లగడపాటి రెండో పెళ్లి గురించి ఒక లాయర్ చేత ..సాక్షి పేపర్లో లగడపాటి గురించి రాయటం లాంటి పనులు జగన్ చేయటం చాలా విడ్డురంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒక పక్క మోసం, కుట్ర , కుతంత్రాలు , చేస్తూనే జగన్.. మరో పక్క నేను మంచి వాడిని , నా పై కాంగ్రెస్ కుట్ర సాధిస్తుందని చెప్పటం చాలా ఘోరమైన విషయమాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎవరిమీదైన ఆరోపణలు వస్తే.. వాటిని రుజువు చేసుకోవాలి గానీ ..తన మీద ఆరోపణలు పక్కన పెట్టి .. రామోజీరావు .. రౌడి కాదా, చంద్రబాబు ,దొంగ కాదా, వాళ్లు సంపాదించుకోలేదా? అని చెప్పటమే గానీ ఎప్పుడైన ఏ నాడైన జగన్ మీద ఉన్న ఆరోపణల గురించి మాట్లాడటం జరిగిందా? అని కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. ఇకనైన ప్రజలు నిజాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సినీయర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more