రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి. ఒక పక్క ఉప ఎన్నికల వేడిలో రాజకీయ పార్టీలు బిజీ బిజీగా ఉంటే.. మరొ పక్క వైఎస్ జగన్ పై సిబిఐ చేస్తున్నహడావుడి రాజకీయాలకు కొత్త సెగ పుట్టించింది. అధికార పార్టీ పై వైఎస్ జగన్ విమర్శలతో రెచ్చిపోతున్నసమయంలో సిబిఐ జగన్ కు అడ్డుకట్ట వేసిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సిబిఐ జగన్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయటంతో జగన్ కు పెద్ద షాక్ తగిలిందని కాంగ్రెస్ వారు అంటున్నారు. సిబిఐ దెబ్బకు జగన్ బ్లాక్ డే గా ప్రకటించటం చేశారు. అసలు బ్లాక్ డే ఎందుకు ప్రకటిస్తారు? ఎందు కోసం ప్రకటిస్తారు? ఎవరి కోసం ప్రకటిస్తారు? ఇవన్ని జగన్ తెలుసా? ఒక్కరు బ్లాక్ డే ప్రకటిస్తే సరిపోతుందా? ప్రజల మద్దతు అవసరం లేదా? ప్రజలకు ఉపయోగపడే విషయం అయినప్పుడు, సంయుక్త ప్రజల మద్దతుతో ప్రభుత్వ పై బ్లాక్ డే ప్రకటిస్తారని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
అసలు జగన్ బ్లాక్ డే ప్రకటించటంలో అర్థం ఏమిటి? ఆయన సంపాదించిన నల్లధనం, అక్రమ ఆస్తులు, ఆయా కంపెనీల మీద వచ్చే ఆధాయం గురించి ప్రభుత్వం తెలియాకూడదా. ఆయన అవినీతికి పాల్పడ్డ కూడా పట్టించుకోకుండా ఉండాలేమోనని ప్రజలు అంటున్నారు. అవినీతి ఎవరు పాల్పడిన చట్టం చూస్తూ ఉరుకోదు. చట్టం తన పని తను చేసుకుంటుపోతుందని సీనియర్ మేథావులు అంటున్నారు.
ఉదాహరణకు. 2జీ కుంభకోణంలో అవినీతి పాల్పడిన .. మాజీ టెలికాం మంత్రి ఎ రాజా ను జైల్లో పెట్టిన విషయం జగన్ కు తెలియదా? అలాగే కేంద్ర మంత్రి సురేష్ కల్నాడిని కామెన్ హెల్త్ గెమ్స్ లో అవినీతికి పాల్పడటంతో అతన్ని జైలుకు పంపించిన విషయం జగన్ కు గుర్తులేదా ? మరొక విషయం తమినాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అధికారంలో ఉన్నప్పడు ఆయనకు సంబంధించిన కలైంజర్ టీవీ ఖాతాలు 2జీ కుంభకోణం కేసులో స్తంభింపచేశారని చెప్పారు. అక్రమాలకు పాల్పడటంతో.. ఆయన కూతురు ను అరెస్టే చేసిన విషయం వైఎస్ జగన్ కు తెలియాదా? అక్రమంగా అవినీతితో అరవై కంపెనీలు పెట్టిన ఇలాంటి వారిని అవినీతి సొమ్మును ప్రజలకు ఉపయోగపడేలా చెయ్యాలని సీనియర్ రాజకీయా నాయకులు , మేథావులు అంటున్నారు.
ఇలాంటి అవినీతి డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ కార్యలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ భవనాలు , గ్రంథలయాలు, పేద విద్యార్థుకలు ఉచిత విద్య లాంటి పనులు చేయటం వలన అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరికి భయం ఏర్పడుతుందని ప్రజలు అంటున్నారు. అసలు ఎన్నో ఏళ్ళ నుండి వ్యాపార రంగంలో ఉన్నవారు , టాటా, బిర్లా, రిలయాన్స్ లాంటి వారు ఎంతో కష్టపడి వేల కోట్లు సంపాదించారు. ఆ వేల కోట్లు వెనక పెద్ద కష్టం దాగి ఉందని ప్రతి ఒక్కరి తెలుస్తుంది. అలాంటి 5 సంవత్సరాల్లో లక్ష కోట్లు సంపాదించిన జగన్ ప్రభుత్వం లెక్కలు అడగటం తప్పా? ఒక వ్యక్తి సడన్ గా ..ఉన్నవాడైతే మనమే ఎన్నో రకాలుగా అనుకుంటాం. అలాంటి ప్రభుత్వం జగన్ని లెక్కలు చూపించమనటం తప్పా? అని ప్రజలు అడుగుతున్నారు. వెనకటికి ఒక వ్యక్తి ఇలా అన్నాడట. జగన్ చేస్తే సక్రమాని .. అదే వేరే ఎవరైన చేస్తే ..అక్రమం అవుతుందా? సీనియర్ మేథావులు అంటున్నారు.
చట్టం ముందు అందరు సమానులే. ఎవరు చట్టానికి చుట్టం కారని ఎన్నో సందర్భాలలో నిరూపించటం జరిగింది. ఎవరిమీదైన నేరం మోపబడితే.. దాన్ని కోర్టులో రుజువు చేసేకోవాలి. అంతేగానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. గతంలో సురేష్ కల్మాడీ, రాజా , కనిమెళి, సత్యం లింగా రాజు, లాంటి వారు జైలు వెళ్లిన వారే. ప్రభుత్వ ఆఫిష్ ల్లో చిన్న చిన్న అవినీతి పాల్పడితే.. ఆ ఉద్యోగిని వెంటనే సప్పెండ్ చేయటం, అతని మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఆ ఉద్యోగి కోర్టు ద్వారా తన నిజాయితీని నిరూపింకోని మరళ ఉద్యోగంలో చేరటం మనకు తెలిసిన విషయమే. సిబీఐ వారు ఎప్పుడు ఎవరి మీద రైడ్ చేస్తారో వారికే తెలియదు. అలాంటిది జగన్ ముందుగా నోటీస్ ఇవ్వలేదని ఎలా అంటాడని ప్రజలు అంటున్నారు. ఏదో సామెత మాదిరిగా .. సొంత ఊరిలో చేస్తే .. సంసారం.. అదే పరాయి ఊరిలో చేస్తే శ్రుంగారం అనే విధంగా జగన్ తీరు ఉందని సీనియర్ మేథావులు అంటున్నారు.
సాక్షి పత్రిక టీవీ చానల్ సంస్థక చెందిన అకౌంట్లను సీబీఐ సీజ్ చేయిస్తే పత్రికా స్వేచ్చపై దాడి అని చొక్కాలు చించుకుంటున్న జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీలు.. మరి ఇదే సీబీఐ ఆరు మాసాల కిందట సూర్య దినపత్రిక అధినేత ను జైలుకు పంపినప్పుడు ఎందురు నోరు మెదపలేదని సామ్యాన ప్రజలు అడుగుతున్నారు. జగన్ సంస్థల యాజమాన్యానికి , సీబీఐకి మద్య జరుగుతున్న ఈ సంఘర్షణ ను పత్రికా స్వేచ్చకు భంగం వాటిల్లుతున్నట్లుగా వర్ణించడం, బ్లాక్ డే భావించటంలో అర్థంలేదని సీనియర్ మేథావులు అంటున్నారు. గతంలో రామలింగరాజు జైలుకు వెళ్లిన సందర్భంలో సంక్షోభంలో ఉన్న సత్యం కంప్యూటర్స్ సిబ్బందికి ప్రభుత్వమే భరోసాగా నిలిచి మరో సంస్థతో సత్యం కంప్యూటర్స్ను టేకన్ ఓవర్ చేయించిన విషయం జగన్ తెలియాదా? ఇప్పుడు జగన్ సంస్థలో పనిచేస్తున్న పాత్రికేయ సిబ్బందికి ప్రభుత్వం అదే తరహాలో భరోసా కల్పిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నేను ఎంపీని నన్నే అరెస్టు చేస్తారా? అంటు జగన్ విర్రవీగుతున్నారని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
ప్రజల ఆస్తులను కొల్లగొట్టి రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడినందుకు చట్టప్రకారం సీబీఐ సమన్లు జారీ చేస్తే అది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పత్రికా స్వేచ్చకు గొడ్డలి పెట్టు అని జగన్ పేర్కొనటం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. అసలు ఎంత గగ్గోలు పెట్టిన ప్రజలు నమ్మేస్థితిలో లేరని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఖాతాల నిలిపివేత వైఎస్ కుటుంబానికి , జగన్ కు బ్లాక్ డే తప్ప ప్రజలకు కాదని, సీబీఐ ఖాతాలను స్తంభింపజేసిందే తప్ప సాక్షి పత్రికను కాదని, అలాగే సాక్షి ఛానల్ జోలికి వెళ్లలేదని సీబీఐ వారు అంటున్నారు. అలాంటప్పుడు పత్రికా స్వేచ్చకు ఎలా భంగం కలుగుతుందని సీబీఐవారు ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more