తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్బ్యూరో మాజీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి ఎవరూ ఊహించని విధంగా సమావేశమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గత కొంత కాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఉమ్మారెడ్డి.. ఇటీవల టీడీపీ చీఫ్ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ పొలిట్బ్యూరో సమావేశానికి కూడా గైర్హాజరైన విషయం తెల్సిందే. దీనిపై స్పందిస్తూ.. టీడీపీ సభ్యత్వం లేని తాను ఆ పార్టీ పొలిట్బ్యూరో సమావేశానికి ఎలా హాజరవుతానంటూ ఎదుకు ప్రశ్నించారు. పైపెచ్చు.. టీడీపీలో కాపు వర్గానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో... లగడపాటి రోజగోపాల్ ఉన్నట్టుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఉమ్మరెడ్డి టీడీపీకి గుడ్బై చెప్చి.. కాంగ్రెస్ పంచన చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అసంతృప్తితో ఉన్న గుంటూరు జిల్లా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్తో భేటీ అయ్యారు. అసంతృప్తి నేపథ్యంలో చంద్రబాబుతో ఉమ్మారెడ్డి నేడు భేటీ కానున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఉమ్మారెడ్డి మాత్రం ఇప్పటి వరకు బాబుతో భేటీ కాలేదు. సరికదా లగడపాటితో మంతనాలు జరపడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. ఉదయం లగడపాటి రాజగోపాల్ హైదరాబాదులోని ఉమ్మారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. గుంటూరు జిల్లాలో కాపులను తమ దరి చేర్చుకునే ఉద్దేశ్యంలో భాగంగానే లగడపాటి ఆయనను కలిసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మారెడ్డికి గుంటూరు జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రధాన నేత. దీంతో ఆయనను తమ దరి చేర్చుకునేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఉమ్మారెడ్డి అసంతృప్తి వ్యవహారం బహిర్గతం కాగానే ఆయన ఏ క్షణంలోనైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. దీంతో ఆదిలోనే అతను అటు వైపుకు వెళ్లకుండా పార్టీ లగడపాటిని రంగంలోకి దించి ఉంటుందని అంటున్నారు. కాగా ఇటీవల తనకు రాజ్యసభను ఇవ్వక పోవడంతో ఉమ్మారెడ్డి బాబుపై అసంతృప్తితో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన పార్టీని తీవ్రంగా విమర్శించారు. పార్టీలో కాపులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, 1983లో పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కాపులకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని ఆయన విమర్శలు చేశారు. ఉప ఎన్నికలకు ముందు ఉమ్మారెడ్డి వ్యాఖ్యలు టిడిపిలో కలకలం సృష్టించాయి. వెంటనే పార్టీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం, గుంటూరు జిల్లా కాపు నేతలు బాబును కలిశారు. బాబుతో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పార్టీలో కాపులకు ప్రాధాన్యత లేదనటంలో వాస్తవం లేదన్నారు. అయితే 2014 ఎన్నికలలో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తాము బాబును అడిగామని, గుంటూరులో రెండు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అందుకు బాబు సానుకూలంగా స్పందించారన్నారు. ఉమ్మారెడ్డి పార్టీని వీడరని, ఆయన అంశం తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more