ఎమ్.ఐ.ఎమ్.నేత అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభ లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కర్ర విరగకుండా పాము చచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అంటే సమస్య పరిష్కారం కావాలి కాని సమైక్య రాష్ట్రం కొనసాగించాలన్న అర్ధం వచ్చేలా ఆయన మాట్లాడరిన అనుకోవచ్చు. అలాగే సమస్య వల్ల నష్టం లేకుండా పరిష్కారం జరగాలని కోరుకుంటున్నారని అనుకోవచ్చు. అయితే తమ వైఖరిని శ్రీకృష్ణ కమిటీ ముందే చెప్పామని , కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయరాదని, మత శక్తులకు అవకాశం వచ్చే విధంగా తెలంగాణపై నిర్ణయం జరగరాదని , హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగంగానే ఉండాలని ఆయన సూచించారు. ఎమ్.ఐఎమ్. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతోంది. లేకుంటే రాయల తెలంగాణ ఇవ్వండని చెబుతోంది. అయితే తెలంగాణ ఇస్తే బిజెపి పుంజుకుంటుందని పరోక్షంగా హెచ్చరించింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను చేస్తే తమ రాజకీయ ప్రయోజనాలకు నష్టమని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే అసలు సమస్య. అన్ని పార్టీలు తమ రాజకీయ కోణంలో ఆలోచించే పరిష్కారాన్ని సూచిస్తున్నాయి. దాంతోనే చిక్కులు వస్తున్నాయి.
అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏదైనా అడిగే హక్కువుంటుంది. అలాంటప్పుడు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చిన్న సమస్యను పెద్దగా చేస్తున్నారు. 36 కోట్ల జనాభా కలిగిన అమెరికాలో 56 రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది 120 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో చాలా తక్కువ రాష్ట్రాలే ఉన్నాయి. అయినా తెలంగాణ రాష్ట్రం ఒక్కరో ఇద్దరో కోరడం లేదు. 4 కోట్ల మంది ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నారు. అలాంటప్పుడు రాష్ట్రం ఇస్తే తప్పేముంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి హైదరాబాద్ ని పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచి తరువాత ఎవరికి వారు విడిపోతే పోయేది ఏం లేదు. తెలుగు భాష మాట్లాడే మనం రెండు రాష్ట్రాలుగా విడిపొయినంత మాత్రాన తెలుగు వాళ్ళం కాకుండాపోం.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా హైదరాబాద్ లో నివసించేవారు తెలంగాణ వారే అవుతారు. మీ ప్రాంతం మా ప్రాంతం అని కాకుండా స్నేహపూరిత రాష్ట్రంగా ఉంటే మంచిదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయ నాయకుల రెచ్చగొట్టు తనం వల్లనే ఈ సమస్య ఇంత జఠిలంగా మారిందే తప్ప, రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేముంది. ప్రజాస్వామ్యానికి దిశా నిర్థేశం చేసేది రాజకీయ నాయకులే. రాష్ట్రం పేరు చెప్పి కేసీఆర్ కోస్తా ప్రజలను విమర్శిస్తే... రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను విమర్శిస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు, ఇక పై జరగబోయే పరిణామాలకు కూడా రాజకీయ నాయకులే బాధ్యత వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more