భలే చౌక బేరం.. రండి.. త్వరపడండి.. ఆశకు మించిన అవకాశం చేజారిపోతుంది. భలే చౌక భేరం. మీకు కోసం సరసమైన ధరలకే విల్లా ప్లాటు అమ్మబడును. ఇది కేవలం విఐపిలకు మాత్రమే .. ఒక గజం విలువ రూ. 5 వేలు మాత్రమే. మీకోసం ఎమ్మార్ టౌన్ షిష్ వారు అందిస్తున్నారు. రూ. 15 వేలు, రూ. 20 వేలు విలువ చేసే గజం. కేవలం రూ. 5వేలకే అమ్మబడును. అనే భోర్డు .. ఎమ్మార్ టౌన్ షిప్ వారు పెడితే.. కొన్ని లక్షల విల్లా ప్లాల్లు అమ్ముడుపోతాయి. హైదరాబాద్ చూట్టు 30 కిలో మీటర్ల దూరంలో కూడా ఇలాంటి రేటు లేదు. కానీ ఈ రేటుకు హీరో బాలయ్య భార్య వసుంధర , 2,440 చదరపు గజాల ప్లాటు కొన్నారు. అంటే ఒక కోటి 16 లక్షల రూపాయలకే విల్లా ప్లాటును కొన్నారని ఆమె సిబిఐకి తెలిపింది. ఆమె ఎలా విల్లా ప్లాటును సొంతం చేసుకుంది వసుంధర మాటల్లోనే...
ఎమ్మార్ టౌన్షిప్లో తాము కొనుగోలు చేసిన విల్లా ప్లాటుకు చదరపు గజానికి రూ. 5 వేలు మాత్రమే చెల్లించామని నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంచేశారు. ఎమ్మార్ టౌన్షిప్లో 2,440 చదరపు గజాల ప్లాటును కొనుగోలు చేయాలని భావించి 2006లో తమ కూతురు బ్రహ్మణి పేరిట బుక్ చేశామని ఆమె తెలియజేశారు. చదరపు గజానికి రూ. 5,000 చొప్పున ఒక కోటి 16 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పారు. 2010 మార్చి 31న తన కూతురు పేరుతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయిందని ఆమె తెలియజేశారు.
ఎమ్మార్ టౌన్షిప్లో చదరపు గజం రూ. 15 నుంచి రూ. 20 వేలకు కొనుగోలు చేసినట్లు.. ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి సీబీఐ వాంగ్మూలాలు సేకరిస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ భార్య మాత్రం తమ కూతురి పేరుతో కొనుగోలు చేసిన ప్లాటుకు చదరపు గజానికి రూ. 5,000 మాత్రమే చెల్లించినట్లు పేర్కొనటం గమనార్హం.
‘‘2007 సంవత్సరంలో మణికొండ గ్రామం దగ్గర ఎమ్మార్ ప్రాపర్టీస్ గోల్ఫ్కోర్సు, విల్లా ప్లాట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను అభివృద్ధి చేస్తోందని నా స్నేహితుల ద్వారా తెలుసుకున్నా. ఆ ప్రాజెక్టులు నా మిత్రులు కొందరు అప్పటికే ప్లాట్లు బుక్ చేసుకున్నారు. నా స్నేహితుల నుంచి కె.శ్రీనివాసరావు ఫోన్ నంబర్ తీసుకుని, 2006 చివర్లోనో, 2007 జనవరి మొదట్లోనో ఫోన్లో సంప్రదించా. కొన్ని రోజుల తర్వాత ఆయన ప్రాజెక్టు లే అవుట్ ప్లాన్ పత్రాలతో మా ఇంటికొచ్చారు. బి-28 నంబర్లోని 2,077 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాటును నా కుమార్తె బ్రాహ్మణి పేరు మీద బుక్ చేయాలని చెప్పా. చదరపు గజం రూ. 5,000కు ఇవ్వజూపారు.
2007 ఫిబ్రవరి 7న ఎమ్మార్ పేరు మీద రూ.లక్ష చెక్కు, రూ.9,38,500 చెక్కులు, స్టైలిష్ హోమ్స్ పేరు మీద రూ. 2,33,122 ను మరో చెక్కు ఇచ్చా. 2,440 చదరపు గజాలున్న బి-19, బి-20 ప్లాట్లు కేటాయించినట్లు ఎమ్మార్ నుంచి 2008 ఆగస్టులో మాకు సమాచారం అందింది. దానికి ఎమ్మార్కు రూ1,05,51,500 చెల్లించాలని చెప్పారు. ఆ మేరకు రూ.1,05,55,085ను డీడీ ద్వారా చెల్లించా. 2010 మార్చిలో స్టైలిష్ హోమ్స్ పేరు మీద రూ. 2,98,141, రూ. 11,030ను రెండు చెక్కుల ద్వారా చెల్లించాం. ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్కు రూ. 2,58,915, రూ. 2,37,500 రెండు చెక్కుల ద్వారా చెల్లించాం. స్థలంలో భవన నిర్మాణానికి ఏపీఐఐసీ నుంచి ఇంకా బిల్డింగ్ ప్లాన్ అనుమతి పొందలేదు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more