తెలంగాణ భవనంలో ఉగాది పంచంగం చదివిన దగ్గర నుండి . టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పంతులుగారు చెప్పినట్లు తెలంగాణకు సీఎంగా.. మహిళ అవుతుంది అని చెప్పాటంతో.. కేసిఆర్ ఆశలు ఆకాశానికి ఎగిశాయి. అందుకు అనుగుణంగా ..కేసిఆర్ అడుగులు వేస్తున్నాడు. కేసీఆర్ మళ్లీ విశ్వరూపం ప్రదర్శించబోతున్నారు. గతంలో ఇతర పార్టీలను చీల్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఆపరేషన్ ఆకర్షను తెలంగాణలో మరింత పదునుపెడుతు న్నారు. తెలుగుదేశం పార్టీని చీల్చి, ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్క రినే తన వైపు ఆకర్షించుకుంటున్న కేసీఆర్ చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు పడింది.
కాంగ్రెస్- టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మళ్లీ వారిని గెలిపించిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలను ఆకర్షించే పనిలో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను దారికి తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవు తుండటంతో ఇక ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్లో ఉంటూ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఎంపీలపై వల విసిరి, వారిని తమ పార్టీలో చేర్చుకునే వ్యూహానికి పదునుపెడుతున్నారు.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణలో టీడీపీ మాదిరిగానే కాంగ్రెస్ను కూడా నిర్వీర్యం చేసి అతి పెద్దపార్టీగా ఎదిగేందుకు కేసీఆర్ తన వ్యూహానికి పదనుపెడుతున్నారు. అందులో భాగంగా మొదటి నుంచీ తెలంగాణ ఇవ్వాలని నినదిస్తోన్న ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంద జగన్నాధం, జి.వివేక్, గుత్తా సుఖేందర్రెడ్డిని టీఆర్ఎస్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. మిగిలిన ఎంపీలు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఈ ఐదుగురు మాత్రం గట్టిగా గళం విప్పుతుండటం, దానితో వారిపై ప్రజలకు నమ్మకం పెరుగుతుండటాన్ని గమనించిన కేసీఆర్, వారిని టీఆర్ఎస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు వారితో కేసీఆర్, హరీష్, కేటీఆర్, వినోద్ వంటి అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
వారు రాజీనామా చేస్తే టీఆర్ఎస్ టికెట్లతో తిరిగి భారీ మెజారిటీతో గెలిపిస్తామని, కాంగ్రెస్-టీడీపీ నుంచి వచ్చిన డాక్టర్ రాజయ్య, జూపల్లి, గంప గోవర్ధన్ వంటి వారిని గెలిపించిన విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నారు. ఇటీవలి కాలం వరకూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసంతో ఉన్నామని, అయితే ఢిల్లీ పరిస్థితులు, రాష్ట్రం నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు చూస్తే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం కష్టమన్న నిర్ణయానికి వచ్చినట్లు కేసీఆర్ వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో కొనసాగితే మీ రాజకీయ ఉనికి కూడా కష్టమని, మీరంతా రాజీనామాలు చేసి వస్తే తిరిగి విజయం సాధించడం కష్టం కాదని, అప్పుడు కాంగ్రెస్పై ఒత్తిడి పెరుగుతుందని కేసీఆర్, ఆయన పార్టీ నేతలు ఆ ఐదుగురు ఎంపీలకు నచ్చచెబుతున్నట్లు సమాచారం. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ స్థానాల్లో ఇప్పటినుంచే ప్రత్యామ్నాయాలు తయారుచేసుకోకతప్పదని సంకేతాలిచ్చినట్లు తెలిసింది.
ఈ సమావేశాల్లో తాను పార్లమెంటులో తెలంగాణపై ఒత్తిడి చేస్తానని, తనతో కలసి వచ్చే వారితో మాట్లాడి మద్దతు కూడగడతానని చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో ఉంటే మళ్లీ గెలవడం కష్టమని, ప్రజలు విశ్వసించని పార్టీలో కొనసాగితే, తెలంగాణ గురించి ఎంత పోరాడుతున్నా రాజకీయంగా కూడా ఫలితం ఉండదని ఆ ఎంపీలకు నచ్చచెప్పి, వారిపై మానసిక ఒత్తిడి పెంచే పనిలో ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more