శాసనసభలో తనను స్వతంత్ర సభ్యురాలిగా గుర్తించి తనకూ ప్రజా సమస్యలపై సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్కు లేఖ రాశారు. ‘కాంగ్రెస్లో పీఆర్పీ విలీనమైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చి ఇప్పటికి 4 నెలలకు పైనే అయింది.. పీఆర్పీని ఇంకెన్ని రోజులు సభలో ప్రత్యేక పార్టీగా గుర్తించాలని అనుకుంటున్నారు?’ అని ఆమె స్పీకర్ను ప్రశ్నించారు. గత ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా గెలుపొందిన శోభానాగిరెడ్డి.. ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యే ప్రతిపాదనకు గతంలో తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.
సహజంగా అసెంబ్లీలో ఏ పార్టీకి సంబంధించిన విప్లు ఎవరి పేర్లు ఇస్తారో వారికే సభలో సమస్యలపై మాట్లాడే అవకాశం ఇస్తుంటారని చెప్పారు. పీఆర్పీని అసెంబ్లీలో ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. అదే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఒక పార్టీ సభ్యులు ఇంకొక పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ల ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంది. కానీ.. వారి సభ్యత్వం రద్దు చేయకుండా, వారిని కాంగ్రెస్ సభ్యులుగా గుర్తించకుండా.. ఇప్పటికీ వారికి పీఆర్పీ సభ్యులుగానే అన్ని అంశాలపై మాట్లాడే అవకాశం స్పీకర్ ఇస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు.
పీఆర్పీ సభ్యులు స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకుని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా.. వారిని ఇంకా కాంగ్రెస్లో విలీనం అయినట్లు ప్రకటించకపోవటం వాస్తవాలనూ, న్యాయాన్నీ అవహేళన చేయటం కాదా? అని శోభ తను రాసిన లేఖలో స్పీకర్ను ప్రశ్నించారు. విలీనాన్ని వ్యతిరేకించిన తనకు సభలో స్వతంత్రురాలిగా కొనసాగే అవకాశం ఉందని ఆమె రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనలను ప్రస్తావించారు. కాంగ్రెస్లోపీఆర్పీ విలీనాన్ని గత ఏడాది మార్చి 7వ తేదీ నుంచే అనుమతించినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ గత జూన్లోనే ఒక లేఖ ద్వారా తెలియజేసిందని ఆమె గుర్తుచేశారు.
అదే రీతిలో రెండు నెలల కిందట పీఆర్పీ విలీనానికి సంబంధించి స్పీకర్కు కూడా లేఖ ఇచ్చారని ఆమె జ్ఞాపకం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితా నుంచి పీఆర్పీని ఎన్నికల కమిషన్ తొలగించినపుడే తాను స్వతంత్రురాలినయ్యానని పేర్కొన్నారు. తాను మినహా పీఆర్పీ ఎమ్మెల్యేలందరూ ఇంటా బయటా కాంగ్రెస్లో చెట్టాపట్టలేసుకుని తిరుగుతున్నారని.. అయినా సభలో మాత్రం విలీనం అయినట్లు ప్రకటించకపోవటమేమిటని ఆమె ప్రశ్నించారు.
ఒక పక్క వాళ్లు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ కండువాలు కప్పుకుని అసెంబ్లీకి వస్తున్నారు.. మరోపక్క పీఆర్పీ ఇచ్చిన విప్ను ధిక్కరించానని నన్ను అనర్హులుగా ప్రకటించాలని ఒత్తిడి తెస్తున్నారు అని శోభానాగిరెడ్డి తప్పుపట్టారు. ఈ సందిగ్ధతను తొలగించాలని స్పీకర్ను కోరారు. పీఆర్పీని కొనసాగించాలని అనుకుంటే వేరే పార్టీ సభ్యత్వం తీసుకున్నందుకు వారిని అనర్హులుగా ప్రకటిస్తారా? లేదా నన్ను స్వతంత్ర అభ్యర్థిగా గుర్తిస్తారా అన్నది స్పష్టం చేయాలిఅని కోరారు. తనను స్వతంత్ర సభ్యురాలిగా గుర్తిస్తే తనకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా ఎమ్మెల్యే పదవికి తను చేసిన రాజీనామాను ఆమోదించినా అభ్యంతరం లేదన్నా రు. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని శోభా నాగిరెడ్డి అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more