దివగంత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం జగన్ ఆయనకు నిద్ర లేకుండా చేసాడనే పుకార్లు వినిపించాయి. జగన్ వల్ల రాజశేఖర రెడ్డి మానసికంగా చాలా దెబ్బతిన్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జగన్ తన పంతం కోసం.. ఏమైన చేస్తాడని, ఎలాంటి వారినైనా వాడుకుంటాడని.. అందుకు, తండ్రి ,తల్లి, భార్య అనే భేదం లేకుండా జగన్ తన మొండి వైఖారిని వారిపై రుద్దుతాడని కుంటుంబ సభ్యులు అంటున్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత .. జగన్ హస్త్రంగా తన తల్లి విజయమ్మను రాజకీయల్లోకి దించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ మరొ కొత్త ప్లాన్ వేశాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మిని బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆమెను రంగంలోకి దింపడం ద్వారా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఇరుకునపెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈనెలాఖరుకు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల మూడవ వారం లో ఎన్నికలు జరగనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ప్రస్తుతం శాసన సభలో తమకు ఉన్న 17 మంది బలంతో రాజ్యసభ బరి లోకి దిగాలని వైఎస్సార్ కాంగ్రెస్ యోచిస్తోంది. పది మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ అభ్యర్ధిని ప్రతిపాదించ వలసి ఉంటుందన్నది తెలిసిందే. అందులో భాగంగా, వైఎస్ విజయలక్ష్మి, వివేకానందరెడ్డి పేర్లు చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం వివేకానందరెడ్డి తనకు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సీటు కోసంతీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీని, ఇతర ప్రముఖులనూ కలుస్తున్నారు. అయితే, ఈ పరిస్థితిలో వివేకాకు రాజ్యసభ సీటు ఇవ్వడం కష్టమని వైఎస్సార్ కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పార్టీ నాయకత్వం తనను నిర్లక్ష్యం చేస్తోందన్న భావనతో ఉన్నారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను రాజ్యసభ అభ్యర్ధిగా నిలబెడితే, ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు సాధించవచ్చని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నారు. అయితే, వివేకానందరెడ్డి కంటే విజయలక్ష్మి అయితేనే వ్యూహం ఫలిస్తుందని, కాంగ్రెస్ కూడా కచ్చితంగా ఆ వ్యూహంలో ఇరుక్కుంటుందని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు.
విజయలక్ష్మి నేరుగా అభ్యర్ధిగా ఉంటారు కాబట్టి, వైఎస్ సానుభూతి విపరీతంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. విజయలక్ష్మి అభ్యర్థిగా ఎమ్మెల్యేలను ఓట్లు అభ్యర్ధిస్తే వైఎస్తో ప్రత్యక్ష అనుబంధం ఉన్న ఎమ్మెల్యేలు నైతిక సంకటంలో పడటం ఖాయమంటున్నారు. దానితోపాటు ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఆమె పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మరక్షణలో పడటం ఖాయమం టున్నారు. ఒకవేళ గెలిస్తే 14 రోజుల్లోగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. అప్పుడు పులివెందులకు వివేకానందరెడ్డినే బరిలోకి దింపాలని సూచిస్తున్నారు. వివేకాను ఉన్న మంచిపేరు, పరిచయాలన్నీ పార్టీ విజయానికి దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. కడప ఉప ఎన్నికల తర్వాత వివేకానందరెడ్డితో మళ్లీ జగన్ కుటుంబం సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఫలితాల తర్వాత కూడా జగన్ మీద వస్తున్న ఆరోపణలను వివేకా ఖండించిన విషయం తెలిసిందే.
మొత్తం మీద జగన్ తన తల్లి పావుగా వాడుకుని మళ్లీ తన హవా చూపించాలనే ఎత్తులు వేస్తున్నాడని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more