‘Unstoppable’ brings Balayya and Chiru on same Platform ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్

Balakrishna chiranjeevi come face to face on talk show unstoppable

AHA, OTT platform Aha, Unstopable, celebrity talk show, BalaKrishna, Chiranjeevi, Ram Charan, Nandamuri Balakrishna, ‘Akhanda’, Dussehra, Manchu Mohan Babu, Manchu Vishnu, Manchu Lakshmi, Manchu Manoj, Acharya, Tollywood, Movies, Entertainment

Telugu’s biggest OTT platform Aha will have Nandamuri Balakrishna hosting a talk show. Everything is set for the ‘Akhanda’ hero to host a celebrity talk show titled ‘Unstoppable’.Also, the makers of the show seem to have shot for an exciting promo with Balakrishna, which would be unveiled for Dussehra.

బాలకృష్ణ ‘అన్ స్టాపెబుల్’ వేదికపై చిరంజీవి, రామ్ చరణ్

Posted: 10/13/2021 02:27 PM IST
Balakrishna chiranjeevi come face to face on talk show unstoppable

నందమూరి నటసింహం బాల‌కృష్ణ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై హాజరుకానున్నారు. సరదాగా ఏదో శుభకార్యానికి హాజరై వారు పలకరించుకోవడం ఇప్పటికే పలు సందర్భాల్లో మనం చూశాం. అయితే వారు మాట్లాడుకునే విషయాలను తెలుసుకోవాలన్న అమితాసక్తి అభిమానుల్లో కూడా నెలకొంటోంది. దీంతో అభిమానుల ఆసక్తిని తెలుసుకున్న.. తెలుగు అతిపెద్ద ఓటిటీ ఫ్లాట్ ఫామ్ ఆహా యాజమాన్యం.. వారు మాట్లాడుకునే ప్రతీ విషయాన్ని మనతో షేర్ చేసుకోనుంది. ఔనా అంటూ అశ్చర్యపోతున్నారా.. ఇది నిజం.

అదెలా అంటారా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాత‌గా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన ప్ర‌ముఖ‌ తెలుగు డిజిట‌ల్ ప్లాట్‌ఫాం ‘ఆహా’ లో అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌కృష్ణ‌ లుక్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. కాగా తాజా టాక్ షోకు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు అతిథులుగా రాబోతున్నారు. ఈ దసరా రోజున బాలకృష్ణ షోను ప్రారంభించనున్న అహా.. దసరా రోజున ముందుగా మంచు కుటుంబంతో ఈ షోను ప్రదర్శనను ప్రారంభించనుంది. ఈ షోలో మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, మంచు మనోజ్ లు బాలకృష్ణతో సందడి చేయనున్నారు.

కాగా ఈ షోకు సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర వార్త ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌బోతున్నార‌ట‌. అంతేకాదు వీరితోపాటు రాంచ‌ర‌ణ్ కూడా క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. చిరు-చ‌ర‌ణ్ ఎపిసోడ్‌కు సంబంధించిన చ‌ర్చ‌ల‌ను అల్లు అర‌వింద్ ఇప్ప‌టికే జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. తండ్రీ తనయులిద్ద‌రూ క‌లిసి ప్ర‌స్తుతం ఆచార్య చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం విడుద‌ల‌కు ముందు బాల‌కృష్ణ‌ టాక్ షోకు హాజ‌రైతే…ప్ర‌చార కార్య‌క్ర‌మం కూడా చేసిన‌ట్టు అవుతుంది. మొత్తానికి బాల‌కృష్ణ టాక్ షోలో చిరు-చ‌ర‌ణ్ తో స‌ర‌దాగా ముచ్చ‌టించే విష‌యాల‌పై ఇప్ప‌టినుంచే తెగ చ‌ర్చించుకుంటున్నారు అభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles