కరోనా వైరస్ మహమ్మారి సినీరంగానికి చెందిన ప్రముఖులపై కూడా తన ప్రభావాన్ని చూపింది. గత ఏడాది గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు పలువురిని కబళించివేసిన కరోనా రెండవ దశలోనూ పలువురిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదాన్ని నింపింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ ను బలితీసుకుంది. ఇటీవల కరోనా బారినపడి ఆయన చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేందర్ రావుతో కలసి పలు ప్రేక్షకాదరణ చిత్రాలను రూపోందించారు.
సీనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారకరామారావు), అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి వారితో తెలుగులోను, మమ్ముట్టి, మోహన్లాల్, సురేశ్ గోపి లాంటి హీరోలతో మలయాళంలోనూ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో కలిసి ఎన్నో సినిమాలకు జయరామ్ పనిచేశారు. పెళ్లి సందడి, ఇద్దరు మిత్రులు, పాండురంగడు వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. ఆయను ఇటు తెలుగు పరిశ్రమలోనే కాకుండా అటు మలయాళ చిత్ర పరిశ్రమలోనూ చక్కని సినిమాటోగ్రాఫర్ గా రాణించారు.
జయరామ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయరామ్ స్వస్థలం వరంగల్. ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానించే జయరామ్ ఆయన చివరి చిత్రమైన 'మేజర్ చంద్రకాంత్'కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆంధ్రాక్లబ్లో క్యాషియర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తనకు ఇష్టమైన కళ కోసం సినీరంగంలో అసిస్టెంట్ కెమెరామన్ గా ఎదిగి చివరికి సినిమాటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. ఆయన మరణం పట్ల సినీపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖలు తమ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more