మెగాస్టార్ చిరంజీవి చారిత్రక నేపథ్యమున్న ‘సైరా’ తరువాత నటిస్తున్న చిత్రం `ఆచార్య`. లాక్ డౌన్ కారణంగా షూటింగుకి అంతరాయం కలిగిన సినిమాలలో 'ఆచార్య' కూడా ఒకటి. టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా రూపోందుతున్న ఈ చిత్రం అన్ లాక్ తరువాత ప్రారంభిద్దామన్న తరుణంలో చిత్ర యూనిట్ లోని ప్రతీ ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. కాగా, మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ నివేదిక రావడంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. తనను కలసిన వారిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరిన విషయం తెలిసందే. అయితే గత ఏడు నెలలుగా నిలిచిపోయిన షూటింగును తిరిగి ప్రారంభించింది చిత్ర యూనిట్.
అయితే కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఆయన ఇప్పట్లో ఆచార్య షూటింగులో పాల్గోనే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఐసీఎంఆర్ జారీ చేసిన పోస్టు కోవిడ్ మార్గదర్శకాలను ఆయన తప్పక ఫాలో కావాల్పిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి షూటింగులో పాల్గోనేందుకు రెండు నెలలు పట్టచ్చునని భావించిన దర్శకుడు కొరటాల శివ షూటింగును వాయిదా వేస్తే అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేయలేమని భావించి ప్రస్తుతం చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకుని.. ఆ ప్రకారం షెడ్యూల్ ని మార్చుతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ తో చిత్రాన్ని చేయాలని రెండేళ్ల పాటు ఖాళీగా వున్న దర్శకుడు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంలో తప్పేమిలేదని టాక్ వినిపిస్తోంది.
ఇక దీనికి తోడు ఇది మెగాస్టార్ ఇచ్చిన సూచనేనని, దీంతో ఆయన అభిప్రాయం కూడా కలవడంతో.. ఇలా చిరంజీవి లేకుండానే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరణ కోనసాగనుంది. కాగా, ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను కూడా ఇప్పుడు చిత్రీకరిస్తారట. అలాగే కథానాయిక కాజల్ కూడా త్వరలో షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు. మొత్తానికి చిరంజీవికి కరోనా సోకడం సోకినా సినిమా విడుదలపై మాత్రం దీని ప్రభావం పడకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more