తెలుగు సినీపరిశ్రమలో మెరిసిన అతికొద్ది మంది ఆణిముత్యాలలో ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అగ్రభాగన వున్నారు. గత కొంత కాలం క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆయన మే నెల చివరి వారంలో అందుకు గాను శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు, కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయనకు తన కుమారుడు అర్జన్ కాలేయ భాగాన్ని అందించడంతో తేజకు కాలేయ మార్పిడి చేశారు హైదరాబాద్ లోని ప్రైవేటు అసుపత్రి వైద్యులు. అయితే శస్త్రచికిత్స అనంతరం ఆయన కొన్న రోజుల పాటు అసుపత్రిలో వైద్యుల పరిశీలనతో వున్నారు.
ఆ తరువాత డిశ్చార్జ్ అయిన ఆయన తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ అనారోగ్యం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. తన కుటుంబసభ్యుల పర్యవేక్షణలో వైద్యుల సూచనలను పాటిస్తూ, వారిచ్చిన మెడికేషన్ ను పాటిస్తున్నారు, ఇప్పటికే ఆయన దాదాపుగా కోలుకున్నారు. అయితే, ఒక్కసారిగా ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. ఆయనకు జరిగిన శస్త్రచికిత్స తిరగబెట్టిందని, ఆయన పరిస్థితి విషమంగా మారిందని కూడా ఓ వర్గం మీడియాతో పాటు కొన్ని వెబ్ సైట్లు కూడా వార్తలను ప్రచురించాయి, దీంతో ఆయన తాజాగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
‘‘నేను బాగానే ఉన్నా. శస్త్రచికిత్స జరిగి 47 రోజులైంది. నా ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోంది. నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను సంతోషంగా ఉన్నా. నా గురించి వస్తున్న వదంతులేవీ నమ్మొద్దు. నా ఆరోగ్యం పట్ల ఎవరికైనా స్పష్టత కావాలంటే నేరుగా నాకే ఫోన్ చేయండి’’ అంటూ తన శ్రేయోభిలాషులను ఉద్దేశించి ఆయన ఓ శనివారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. శస్త్ర చికిత్స జరగకముందు నుంచీ సుద్దాల అశోక్ తేజ గురించి వదంతులు సోషల్మీడియాతో చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో నటుడు ఉత్తేజ్ ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ఆస్పత్రి నుంచి కోలుకుని వచ్చిన తర్వాత సుద్దాల తేజ కూడా ఇది వరకే ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి వదంతులపై స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more