ఈ రోజు బాహుబలి సినిమా కోసం ఇలా ఒక స్టేజ్ మీద నుంచున్నా అంటే.. ఇది స్టేజ్ కాదు.. ఇది కొందరి వర్కర్ల భుజాలు. వారి భుజాలపై మేం నుంచున్నాం.. అంటూ బాహుబలిః ది కంక్లూజన్ కోసం పనిచేసిన చిన్న చిన్న కార్మికులను కూడా పేరుపేరునా పొడిగేశాడు రాజమౌళి. తాను మాట్లాడ్డానికి సమయం తక్కువగా ఉన్నా కూడా.. సినిమాకు పనిచేసన ఎంతోమంది వర్కర్లను ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కొనియాడాడు జక్కన్న.
''వర్కర్స్ ఎంతోమంది ఉన్నారు. బ్యాక్ పెయిన్ తో పనిచేసిన మా జిమ్మీ ఆపరేటర్స్ నాగరాజు.. ఈ సినిమా ప్రీ లుక్ డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్.. టీలు అందించిన ప్రొడక్షన్ కుర్రాళ్ళు.. సెట్లకు రంగులు వేసిన వర్కర్స్.. సాంగ్స్ కంపోజింగ్ లో సాయం చేసిన ఫైట్ మాష్టర్లు.. ఫైట్లను తీయడంలో సాయం చేసిన కొరియోగ్రాఫర్లు.. అసలు డ్యాన్స్ మాష్టర్ అయ్యుండీ బాణాల ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన శంకర్ మాష్టర్.. ప్రతీ ప్రాప్ కోసం రిగ్గింగ్ అద్బుతంగా చేసిన సాల్మాన్.. కాస్ట్యూమ్స్ కృష్ణ..'' ఇలా చాలామంది పేరుపేరునా పొగిడేశాడు రాజమౌళి. రాత్రి 12కి వారి పని ముగిసేదని, మళ్లీ తెల్లవారుజామున 3 గంటలకు వారు సెట్ లో సిద్ధంగా ఉండేవారని చెప్పాడు. అలాగే తన ఎడిటర్.. డబ్బింగ్ ఇన్ చార్జ్.. సౌండ్ సూపర్ వైజ్ చేసిన కళ్యాణి మాలిక్ (మ్యూజిక్ డైరక్టర్).. ఇలా అందరినీ పొగిడేశాడు.
బాహుబలి సినిమా సెట్ కు, ఆడియో ఫంక్షన్ కు సాయం చేసిన రామోజీరావు గారికి, హయత్ నగర్ పోలీసులు, కమిషనర్ మహేష్ భగవత్ గారికి ధన్యవాదాలని రాజమౌళి తెలిపారు. తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ చాలా అద్భుతంగా పని చేశారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి డిపార్ట్ మెంట్ ను అభినందించిన రాజమౌళి.. తన భార్యను ఇంకా ఎక్కువ పొగిడితే చెప్పిన మాట వినరని చమత్కరించాడు. ఇక యూనిట్ తన కుటుంబం లాంటిదని చెప్పాడు.
హీరోయిజం ఎలా ఉండాలని ఊహించేవాడినో, అలాగే చేసేవాడినని.... అయితే ప్రభాస్ కు నేను ఏం ఇచ్చాను? అని ఆలోచించే వాడినని.. కానీ, బాంబేలో ప్రభాస్ ఓ ఫంక్షన్ కు వెళ్తే... అక్కడి మీడియా బాహుబలి అంటూ ప్రభాస్ ఎంటర్ అవుతున్నప్పుడు అరిచారని, అది చాలనిపించిందని రాజమౌళి అన్నాడు. అలాగే ఈ సినిమా రెండవ భాగం కోసం తన కొడుకు కార్తికేయ సినిమా సెకండ్ యునిట్ ను బాగా డైరక్ట్ చేశాడని చెప్పాడు రాజమౌళి. ఫస్టు పార్టు ట్రైలర్ ను తాను ఒక స్టోరీ చెప్పి కట్ చేయించినా కూడా.. 2వ పార్టుకు మాత్రం కార్తికేయ తన టీమ్ తో కలసి సొంతంగా ట్రైలర్ కట్ చేశాడని.. 25 వర్షన్లు కట్ చేశాక ఒకటి పిక్ చేశానని ఆయన తెలిపాడు.
67 ఏళ్ల తర్వాత బాహుబలే...
ఇండియన్ సినిమాకు బాహుబలి చాలా విలువైన ప్లాట్ ఫాం ఇచ్చిందని బాలీవుడ్ మేకర్ కరణ్ జోహర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాంటి బాహుబలి వేదికపై మాట్లాడడం తనకు చాలా గర్వంగా ఉందన్నాడు. మొఘల్- ఏ- ఆజమ్ సినిమా తరువాత మళ్లీ భారతీయ సినిమాను తలెత్తుకునేలా చేసిన సినిమా బాహుబలి అని కరణ్ జొహార్ తెలిపాడు. సరిగ్గా 67 ఏళ్ల తరువాత మొఘల్ ఏ ఆజమ్ లాంటి బాహుబలి రావడం గొప్పవిషయమని కరణ్ చెప్పాడు. నాలుగేళ్ల కాలాన్ని ఒక దర్శకుడికి నటులు ఇచ్చేశారంటే వారికి ఎంత నిబద్ధత ఉందో ఊహించవచ్చని కరణ్ అన్నాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా చూపిన నిబద్ధత గొప్పదని కరణ్ ప్రశంసించాడు. ఈ సినిమాను ధర్మాప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం గర్వంగా ఉందని తెలిపాడు. ఇక రాజమౌళిని ఓ రేంజ్ లో పొగిడిన కరణ్ హాలీవుడ్ కన్నా మన దగ్గర తోపు దర్శకులు ఉన్నారన్న దానికి జక్కన నిదర్శనమని పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more