రాణి ముఖర్జీ సహా 16 మంది గుట్టురట్టు చేసిన వ్యక్తికి కోట్ల నజరానా | Mumbai Informer get 5 Crores for IT dope on actors and others

Mumbai man get 5 crores for it dope on actors and others

Mumbai Informer get huge prize money, Bombay HC IT informer, Rani Mukherji assests, Rani Mukherji and Shekhar Suman Income, owed a few crores by the income-tax department

An informer who is owed a few crores by the income-tax department after he clued them up about the hidden assets of actors Rani Mukherji and Shekhar Suman and production houses Balaji Telefilms and Adhikari Brothers is set to get his dues in the next six months, now that the court has passed an order.

సెలబ్రిటీల గుట్టు విప్పి కోట్లు కొట్టేశాడు

Posted: 08/02/2016 04:55 PM IST
Mumbai man get 5 crores for it dope on actors and others

అతనోక మాములు వ్యక్తి. కానీ, గుఢాచారిగా పని చేశాడు. దేనికోసం అనుకుంటున్నారు. సెలబ్రిటీల అక్రమ సంపాదనకు సంబంధించిన విషయాలను ఆదాయపు పన్ను శాఖకు దశాబ్దాలుగా సమాచారం అందజేస్తున్నాడు. ఎట్టకేలకు అతని కష్టంను గుర్తించారు. త్వరలో అతను కోటీశ్వరుడు కాబోతున్నాడు.  

ప్రముఖ బాలీవుడ్ నటి రాణీముఖర్జీ, నటుడు శేఖర్ సుమన్, బాలాజీ టెలిఫిలిం, అధికారి బ్రదర్స్ సహా 16 సంస్థల ఆదాయాన్ని బయటపెట్టిన ఈ ఐటీ ఇన్ ఫార్మర్ కు భారీ నజరానా అందబోతుంది. ముంబయికి చెందిన ఈ ఐటీ ఇన్ ఫార్మర్ 1990 నుంచి 2000 సంవత్సరాల వరకు ఈ తరహా సమాచారాన్ని ఆదాయపుపన్ను శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు దాడులు నిర్వహించగా, దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం రహస్య ఆస్తులు, ఆదాయం గురించి సమాచారం అందించిన వారికి (ఇన్ ఫార్మర్) వసూలు చేసిన ఆదాయపు పన్నులో కొంత భాగం రివార్డు అందజేయాలి. అయితే, సదరు ఐటీ ఇన్ ఫార్మర్ కు ఇప్పటిదాకా అందాల్సిన రివార్డ్ మాత్రం దక్కలేదు.

దీంతో తనకు రావాల్సిన రివార్డు కోసం 2009లో ఐటీ శాఖ కార్యాలయం ముందు దీక్ష చేయడంతో, అప్పటి ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ మూడు నెలల్లోగా రివార్డు సెటిల్ చేస్తామని చెప్పి ఆయనతో దీక్ష విరమింపజేశారు. కానీ, ఏళ్లు గడుస్తున్న ఆ మాట మాత్రం ఇంకా నిలబెట్టుకోలేదు. దీంతో, సదరు ఐటీ ఇన్ ఫార్మర్ బాంబే హైకోర్టును ఆశ్రయించి, తన రివార్డు తనకు ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేశాడు. సమగ్ర విచారణ జరిపిన కోర్టు ఆరు నెలల్లోగా అతని రివార్డు అందజేయాలని ఐటీ శాఖను ఆదేశించింది.  

లెక్క ప్రకారం వసూలు చేసిన దాంట్లో 7.5 శాతం నుంచి 10 శాతం మొత్తాన్ని రివార్డుగా అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన అతగాడికి రూ.5 కోట్ల రివార్డు దక్కబోతుంది. కాగా, తనకు యాభై ఏళ్ల వయసొచ్చిందని, తాను ప్రాణాలకు తెగించి అక్రమ ఆస్తులు, ఆదాయం సంపాదించిన వారి సమాచారాన్ని తెలుసుకుని సంబంధింత అధికారులకు అందజేస్తే ఇలా చేశారని వాపోయిన ఆయన, ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IT informer  Bombay high court  Rani Mukherji  IT department  

Other Articles