ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ నెట్ వర్క్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఎంతపని చేశావే శిరీషా’. శివరామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పట్లూరి బాలకృష్ణ, రామ్ ప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కానల నిర్మాతలు. మహత్ రాఘవేంద్ర కథానాయకుడు. పునర్నవి భూపాళం నాయిక. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో బుధవారం జరిగింది. బ్యానర్ లోగోను తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.రామ్మోహన్ విడుదల చేశారు. టైటిల్ లోగోను అనిల్ సుంకర ఆవిష్కరించారు.
హీరోయిన్ పునర్నవి మాట్లాడుతూ.... కథ బాగా నచ్చింది. కథ విన్నంత సేపూ ఎగ్జయిట్ అయ్యాను. షూటింగ్ కూడా పూర్తయింది. సినిమా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అని తెలిపారు.
చిత్ర నిర్మాత బాలకృష్ణ మాట్లాడుతూ... అనిల్ సుంకర నాకు స్ఫూర్తి. ఆయన మార్గంలోనే వెళ్లి తీసిన ఈ సినిమా హిట్ కావాలి. మా యూనిట్ సభ్యులందరూ కృషి చేసి ఈ సినిమాను చాలా బాగా చేశారు. ఇంటిల్లిపాదీ చూసేలా తెరకెక్కించాం. ఆద్యంతం నవ్వులు తెప్పిస్తూనే ఉంటుంది అని చెప్పారు.
అనిల్ సుంకర మాట్లాడుతూ... బాలకృష్ణ, నేను క్లాస్ మేట్స్. బెంచ్ మేట్స్. అయితే బ్యాక్ బెంచ్ మాత్రం కాదు. కానీ ఈ సినిమా బ్యాక్బెంచ్ సినిమా హీరో మహత్ రాఘవేంద్ర నటించారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. పి.రామ్మోహన్ మాట్లాడుతూ ``ఈ సంస్థ బ్యానర్ లోగో చాలా బావుంది. ఈ సంస్థ మీద దశాబ్దాల తరబడి వీళ్లు సినిమాలు చేస్తూనే ఉండాలి అని చెప్పారు.
సుదర్శన్, అన్నపూర్ణ, సూర్య, అనితా చౌదరి, సుడిగాలి సుధీర్, ప్రియ, జోగి బ్రదర్స్ అశోక్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సహ నిర్మాతలు: విజయ్.కె.మడల, రామ్లక్ష్మణ్ మునిగంటి, లైన్ ప్రొడ్యూసర్: దిలీప్ బొలుగోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్యామ్ బోనాలా,సంగీతం: పూర్ణచందర్ భైరి, కెమెరా: శ్యామ్ ప్రసాద్, ఎడిటర్: సత్య గిడుటూరి, ఆర్ట్: రామ్ కుమార్, కెమెరా: రమేష్ ఎర్రోళ్ల.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more