సినిమాలు ఆడాలంటే.. అభిమానులు కావాలి. అభిమానులు ఆదరిస్తేనే నటులు స్టార్ లు అవుతారు. మాములు హీరోలు సైతం స్టార్ హీరోలుగా మార్చేసే దమ్ము కేవలం అభిమానులకు మాత్రమే వుంది. అలాంటి అభిమానులు కష్టాల్లో వుంటే స్టార్ హీరోలు సాయం చేయకుండా వుంటారా చెప్పండి? ప్రస్తుతం అలాంటి పనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసాడు. ఏకంగా కలియుగ శబరిని కలిశాడు. త్రేతాయుగంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను స్వయంగా ఆ శ్రీరాములవారే తిన్నారట. అది గుర్తించిన బన్నీ.. కలియుగ శబరి ఇచ్చిన పాయసాన్ని కడుపారా అస్వాధించారు.
ఇటీవలే పక్క రాష్ట్రం తమిళనాడులోని చెన్నైలో భారీ వర్షాల వల్ల వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తనవంతుగా విరాళాన్ని ప్రకటించడంతో పాటు ఇంకా సహాయ కార్యక్రమాలలో తనవంతు సాయాన్ని అందిస్తున్నారు. అయితే తాజాగా ఓ క్యాన్సర్ బాధితుడి చివరి కోరికను తీర్చి, అతని గుండెల్లో నిజమైన హీరో అయ్యాడు.
విజయవాడలోని సింగ్ నగర్ లో 65 ఏళ్ల మస్తాన్ బీ అనే మహిళ నివసిస్తోంది. గతంలో అల్లు రామలింగయ్యకు ఆమె వీరాభిమాని. ఆ తర్వాత అల్లు అర్జున్ కు ఫ్యాన్ అయ్యింది. అల్లు అర్జున్ డాన్సులు, యాక్టింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అలాంటి ఆవిడ గతకొద్దిరోజులుగా క్యాన్సర్ తో బాధపడుతూ రోజులు లెక్కబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
Video source: TV9TeluguLive
క్యాన్సర్ వ్యాధి ముదరడంతో ఇంకో ఆరు నెలలు బ్రతకడం కూడా కష్టమని తెలిసింది. దీంతో తన చివరి కోరికగా అల్లు అర్జున్ ను ఒక్కసారైనా చూడాలనుకుంది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తన షూటింగ్ తో బిజీగా వున్నప్పటికీ, కాస్త సమయం తీసుకొని, విజయవాడలోని ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఆమెను ఆప్యాయంగా పలకరించాడు. అల్లు అర్జున్ కు తన చేతులతో పాయసం తినిపించింది. అనంతరం వీరిద్దరూ కాసేపు ముచ్చటించాక ఆమెకు అల్లు అర్జున్ పండ్లను అందజేసాడు.
ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ... అల్లు అర్జున్ ను చూసిన తర్వాత తనకు క్యాన్సర్ వుందనే విషయాన్ని కూడా మర్చిపోయానని, అల్లు అర్జున్ తనకు మనవడిలాంటి వాడని ఆనందం వ్యక్తం చేసింది. ఓ పేదరాలి కోసం అల్లు అర్జున్ ఇంత దూరం రావడం ఆయన గొప్పతనం అని తెలిపింది. అల్లు అర్జున్ తన భార్య, పిల్లలతో చల్లగా వుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more