‘చందమామ కథలు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుని, దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకుని, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ చిత్రం తర్వాత ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు టాకీస్’. ఆర్కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్కుమార్ నిర్మిస్తున్నారు.
ఇందులో సిద్ధూ, నరేష్, శ్రధ్దాదాస్, రశ్మీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. విభిన్నమైన కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వకుండా తెరకెక్కిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పలు అందమైన లొకేషన్లలో ఈ చిత్ర షూటింగ్ జరుపుతున్నారు.
ఈ చిత్రం ద్వారా దాదాపు 200 మంది స్థానికి కళాకారులకు అవకాశం కల్పించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more