నందమూరి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ఒక్క చిత్రంలోనూ నటించలేదు. కనీసం గెస్ట్ పాత్రల్లో సైతం వీరు నటించలేదు. అయితే.. ఇప్పుడు ఈ అన్నాదమ్ములిద్దరూ కలిసి వెండితెరపై ‘బృందావనం’ పండించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం! త్వరలోనే ఈ నందమూరి హీరోలు ఓ ప్రాజెక్ట్ కోసం జడకడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరూ హీరోలు కలిసి ఓ చిత్రాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇండస్ట్రీ న్యూస్!
అయితే.. ఈ సినిమాలో ఒక హీరో వెండితెరపై మ్యాజిక్ చేయగా.. మరొకరు తెరవెనుక వుంటూ రంగులు పూయనున్నారు. అంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్నాడు. నిజానికి వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఎప్పుడో సినిమా చేయాల్సి వుండేది కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ అది ఆ మూవీకి సంబంధించిన పనులు జరుగుతూనే వున్నాయి. ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోవైపు.. ఈ సినిమాకి కావాల్సిన నటీనటుల ఎంపిక కూడా ఇప్పటినుంచే స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక పాత్రకు తగ్గట్టు స్టార్ హీరోయిన్ నే ఈ చిత్రంలో తీసుకోవాలని యూనిట్ నిర్ణయించినట్లు చెప్పుకుంటున్నారు. అక్టోబర్ నెల నుంచి ఈ సినిమా సెట్స్ సైకి వెళుతుందని.. అక్కడి నుంచి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా లేదా మార్చిలో విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. చివరికీ నందమూరీ అన్నాదమ్ములు ఈ విధంగా కలవడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more