Mahesh babu trivikram parthu title athadu movie sequel tollywood rumours

mahesh babu news, trivikram srinivas news, mahesh babu latest news, mahesh babu movies, mahesh babu movie updates, mahesh babu movies categories, mahesh babu trivikram movies, mahesh babu parthu movie, mahesh babu athadu movie, trivikram parthu movie

mahesh babu trivikram parthu title athadu movie sequel tollywood rumours : In the tollywood the rumours are going on that mahesh and trivikram planning to make athadu movie remake with parthu title

అవునా.. నిజమేనా! అతడు మళ్లీ వస్తున్నాడా..?

Posted: 02/03/2015 07:29 PM IST
Mahesh babu trivikram parthu title athadu movie sequel tollywood rumours

ఏదైనా ఒక సినిమా హిట్ అయితే చాలు.. దానికి సీక్వెల్’గా మరో మూవీ రావడం ఇటీవలే కామన్ అయిపోయింది! ఇలా సీక్వెల్ తీయడం వల్ల మొదటి చిత్రం క్రేజ్’తోనే ఈ రెండో మూవీ కూడా సంచలన విజయం సాధించడంతోపాటు భారీ వసూళ్లను రాబడుతుందనే నమ్మకంతో ఇలా అందరూ ఈ ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు ఇదే కోవలోనే త్రివిక్రమ్ - మహేష్ ఇద్దరూ సంయుక్తంగా కలిసి పయనిస్తున్నారనే వార్తలు టాలీవుడ్’లో జోరందుకున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్’లో వచ్చిన ‘అతడు’ మూవీని ఇప్పుడు సీక్వెల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారాలు కొనసాగుతున్నాయి.

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’ చిత్రం క్లాసికల్ హిట్’గా నిలిచిన విషయం తెలిసిందే! అందులో మహేష్ తన నటనతో మెస్మరైజ్ చేస్తే.. త్రివిక్రమ్ తన మాటల మాంత్రిత్వంతో ఆ మూవీకి అట్రాక్టివ్ డైలాగులు అందించాడు. నిజానికి ఈ మూవీకి సీక్వెల్ తీస్తున్నట్లుగా గతంలో ఎవ్వరూ ప్రకటించలేదు. నిర్మాతగానీ, త్రివిక్రమ్ గానీ, హీరోగానీ ఎవ్వరూ ఆ మూవీకి సీక్వెల్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. తాజాగా ఈ ఏడాది హారికా అండ్ హాసిని బ్యానర్ పై వీరిద్దరి కాంబినేషన్’లో రూపొందే మూవీకి ‘పార్థు’ అనే టైటిల్’ని ఫిక్స్ చేసినట్లు సమాచారం! ఆ టైటిల్ వల్లే ఇప్పుడు ఈ సీక్వెల్ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఎందుకంటే.. ‘అతడు’ చిత్రంలో మహేష్ పేరు ‘పార్థు’ అని వుంది. ఇప్పుడు రూపొందబోతున్న తాజా చిత్రానికి అదే టైటిల్ ఖరారు చేయడంపై ఈ మూవీ ‘అతడు’ చిత్రానికి సీక్వెల్ అయి వుండవచ్చునని చెప్పుకుంటున్నారు. ఈ ‘పార్థు’ చిత్రంలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ‘అతడు’ మూవీలో వున్నట్లుగానే కొనసాగించవచ్చునని అంతా చెప్పుకుంటున్నారు. కానీ.. ‘అతడు’ మూవీలో ప్రేమకథతోపాటు, హీరో కథ కూడా సుఖాంతం అయ్యింది కాబట్టి.. ఈ ‘పార్థు’ చిత్రం అందుకు సీక్వెల్ అయ్యే అవకాశం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ రూమర్లపై క్లారిటీ రావాలంటే.. దర్శకనిర్మాతలే స్వయంగా అధికారికంగా వెల్లడించాల్సి వుంటుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles