Ram charan tej latest movie naa peru raju shooting starts from march

ram charan tej latest news, cherry latest news, ram charan tej new movie, naa peru raju movie news, srinu vailta latest movie news, ram charan tej srinu vaitla movie news

ram charan tej latest movie naa peru raju shooting starts from march : ram charan tej and srinu vaitla combination latest movie naa peru raju shooting starts from march.

మార్చి నుంచి ‘రాజు’గా అవతారమెత్తునున్న చెర్రీ!

Posted: 01/19/2015 11:22 AM IST
Ram charan tej latest movie naa peru raju shooting starts from march

‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత మెగాహీరో రాంచరణ్ తేజ్ నటించబోయే తదుపరి ప్రాజెక్ట్’కి సంబంధించి ఆమధ్య కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో తన తాజా చిత్రానికి సంబంధించి చెర్రీ చాలా జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది. సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించుకున్న ఈ మెగాహీరో.. కొన్ని కథలను చదివిన అనంతరం ఫైనల్’గా దర్శకుడు శ్రీనువైట్లతో ఫిక్స్ అయ్యాడు. యాక్షన్-ఫ్యామిలీతోపాటు కామెడీ ఎలిమెంట్స్’ను కూడా శ్రీను తన కథలో చేర్చడంతో చెర్రీ అతనితో కమిట్ అయ్యాడు. అప్పుడే ఈ చిత్రానికి ‘నా పేరు రాజు’ అని టైటిల్ ఖరారు కూడా చేశారు. అయితే షూటింగ్ ఎప్పటినుంచి, హీరోయిన్ ఎవరు..? అన్న విషయాలు మాత్రం బహిర్గతం కాలేదు.

ప్రస్తుతం ఇండస్ట్రీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీను-చెర్రీ కాంబోలో తెరకెక్కనున్న ‘నా పేరు రాజు’ చిత్రం షూటింగ్ మార్చి నెల నుంచి ప్రారంభం కాబోతుందని తెలిసింది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఇక ఇతర పాత్రలకోసం కావలసిన తారాగణాన్ని ఎన్నుకునే పనిలో యూనిట్ బృందాలు నిమగ్నమయ్యాయి. అయతే.. హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సరికొత్త కథతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో శ్రీనువైట్ల కామెడీ పంచులు గతంలోకంటే భారీగా వుంటాయని, అవే ఈ చిత్రానికి మరింత బలాన్ని తెచ్చిపెడతాయని యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

ఇక ‘ఆగడు’తో భారీ పరాజయాన్ని అందుకోవడంతోబాటు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న దర్శకుడు శ్రీనువైట్ల.. చెర్రీతో తీయబోయే చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ‘దూకుడు’ కంటే భారీ విజయాన్ని అందుకున్న తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవాలని కసిగా వున్నట్లు చెబుతున్నారు. అందుకే.. ఈ చిత్రంకోసం ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నాడని, ముఖ్యంగా కథలో చాలా మార్పులు చేశాడని అంటున్నారు. అటు యావరేజ్’తో చెర్రీ, ఇటు ఫెయిల్యూర్’తో శ్రీను కెరీర్లు కాస్త ఇబ్బందుల్లో పడటంతో.. తమ తాజా మూవీమీదే భారీ ఎక్స్’పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇదిలావుండగా.. ఈ మూవీ తర్వాత చెర్రీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించే అవకాశాలు వున్నాయి. ఆ చిత్రానికి కోన వెంకట్ కథను సమకూర్చనున్నాడు. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కావలసి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles